ఏపీలో పూర్తిగా విస్తరించిన నైరుతీ రుతుపవనాలు.
By : Surendra Nalamati
Update: 2025-05-29 03:38 GMT
ఏపీలో పూర్తిగా విస్తరించిన నైరుతీ రుతుపవనాలు.
సాధారణ సమయం కంటే ఈ ఏడాది పది రోజులు ముందుగానే రాష్ట్రంలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు.
బంగాళాఖాతం, ఒడిశా తీరాలకు సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.
ఇది ఉత్తర దిశగా పయనిస్తూ ఈరోజు వాయుగుండంగా బలపడే అవకాశం.
వీటి ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు.
ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం.
మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు.
సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో ఈనెల 31 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు.
గోదావరి, వంశధార నదుల పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.