నెక్స్ట్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు !
జూన్ 9 నుంచి ఈ మూవీ తదుపరి షెడ్యూల్ను హైదరాబాద్లో ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న తీవ్ర గోప్యత కారణంగా.. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. మలయాళ యంగ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.;
సూపర్స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబో మూవీ ప్రస్తుతం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. యస్ యస్ యంబీ 29 గా పిలుచుకుంటోన్న ఈ భారీ జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం హైదరాబాద్, ఒడిశాలో రెండు ముఖ్యమైన షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. పెద్దగా హడావిడి ఏమీ లేకుండానే.. రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళిపోయిన ఈ మూవీ అప్పుడే రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకోవడం అభిమానులకు ఉత్సాహంగా అనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. జూన్ 9 నుంచి ఈ మూవీ తదుపరి షెడ్యూల్ను హైదరాబాద్లో ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న తీవ్ర గోప్యత కారణంగా.. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. మలయాళ యంగ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
యస్ యస్ యంబీ 29 చిత్రాన్ని సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ భారీ యాక్షన్ డ్రామాకు సంగీతాన్ని అందిస్తున్నారు. స్టీవెన్ స్పీల్బర్గ్ ‘ఇండియానా జోన్స్’ ఫ్రాంచైజ్ నుంచి స్ఫూర్తి పొందినట్లు రాజమౌళి వెల్లడించారు. తన స్టైలాఫ్ విజువల్ ఫీస్ట్ కు ఏ మాత్రం కొదవ ఉండదని చెబుతున్నారు కూడా. మరి ఈ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ను మించే రేంజ్ కథతో రూపొందుతుందేమో చూడాలి.