నిర్మాతగా మారుతున్న ఎనర్జిటిక్ స్టార్?
రామ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నాడు. అతని పెదనాన్న రవి కిషోర్ ఇప్పటికే స్రవంతి మూవీస్ బ్యానర్పై సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ, రామ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో సొంత బ్యానర్ను లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్.;
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎప్పటిలాగే తనదైన యాక్షన్ రూట్లో ఫుల్ జోష్తో దూసుకెళ్తున్నాడు, కానీ బాక్సాఫీస్ వద్ద అతని సినిమాలు అంచనాలను అందుకోలేక ఫెయిల్ అవుతున్నాయి. అయినా.. రామ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన కొత్త ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతను పి. మహేష్ బాబు దర్శకత్వంలో ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర కీలకమైన రోల్లో కనిపించబోతున్నాడు, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మిస్తోంది.
రామ్ తన తదుపరి సినిమా గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే, అతను పలువురు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్తో డిస్కషన్స్ జరుపుతున్నాడు. ఇది ఫ్యాన్స్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే.. అసలు సంచలన వార్త ఏంటంటే.. రామ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నాడు. అతని పెదనాన్న రవి కిషోర్ ఇప్పటికే స్రవంతి మూవీస్ బ్యానర్పై సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ, రామ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో సొంత బ్యానర్ను లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్.
ఈ కొత్త బ్యానర్పై మొదటి సినిమాగా ఓ యువ దర్శకుడు డెబ్యూ చేయబోతున్నాడని టాక్. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది ఎర్లీగా స్టార్ట్ కానుంది. రామ్ తన ప్రొడక్షన్ హౌస్ వివరాలను, అలాగే ఈ ఫస్ట్ మూవీ డీటెయిల్స్ను ఈ ఏడాదిలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నాడు. అయితే.. రామ్ తన సొంత ప్రాజెక్ట్లను మాత్రమే నిర్మిస్తాడా లేక ఇతర నిర్మాతలతో కలిసి సినిమాలు నిర్మిస్తాడా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా, రామ్ ఈ కొత్త వెంచర్తో ఇండస్ట్రీలో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడని మాత్రం కన్ఫర్మ్.