పొంగల్ బరిలో విశాల్ సినిమాకి పాజిటివ్ టాక్!
విశాల్ ప్రధాన పాత్రలో సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన 'మదగజరాజా' పొంగల్ స్పెషల్ గా తమిళనాట విడుదలైంది. అనేక ఆర్థిక సమస్యల కారణంగా దశాబ్దం పాటు నిలిచిపోయిన తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా అక్కడ విడుదలైంది.
సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012లోనే పూర్తయింది. కానీ రకరకాల ఆర్థిక కష్టాలతో విడుదల డిలే అయింది. ఎట్టకేలకు అన్ని కష్టాల నుంచి గట్టెక్కి తాజాగా విడుదలైంది. విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా వినోదాన్ని, కమర్షియల్ అంశాలను సమపాళ్లలో మిళితం చేసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందనే కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.
డైరెక్టర్ సుందర్ సి తన సినిమాలను కమర్షియల్, వినోదాత్మక అంశాల సమ్మిళితంగా రూపొందించడంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. మదగజరాజా కూడా ఈ ఫార్మాట్కు మించి నిలిచిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సుందర్ సి ప్రతిభను ప్రశంసిస్తున్నారు. 'ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ కథ ఫేడవుట్ అవ్వలేదు' అంటూ అభినందనలు అందుతున్నాయి.