‘దృశ్యం 3’ పట్టాలెక్కేది అప్పటినుంచేనా?

ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పూర్తిగా క్లారిటీ రాక పోయినప్పటికీ, ఈ సెప్టెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్.;

By :  K R K
Update: 2025-06-14 09:39 GMT

ది కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, క్రేజీ డైరెక్టర్ జీతు జోసెఫ్ మరోసారి కలిసి ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని మూడో భాగం కోసం రీయూనియన్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పూర్తిగా క్లారిటీ రాక పోయినప్పటికీ, ఈ సెప్టెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్. తాజా సమాచారం ప్రకారం, మోహన్‌లాల్ అండ్ జీతు జోసెఫ్ కాంబలో.. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రామ్’ షూటింగ్‌ను మరోసారి పోస్ట్‌పోన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. షెడ్యూల్‌లో కాస్త గ్యాప్ దొరకడంతో.. ఈ డైనమిక్ డ్యుయో ‘దృశ్యం 3’ ని ఫాస్ట్ ట్రాక్‌లో తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది.

2013లో సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ విడుదలైంది. దీనిని జీతు జోసెఫ్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కథ జార్జ్‌కుట్టి అనే మిడిల్-క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసే స్క్రీన్‌ప్లేతో, మోహన్‌లాల్ యొక్క కెరీర్‌లో ఐకానిక్ మూవీగా నిలిచింది. అలాగే.. 2021లో వచ్చిన ‘దృశ్యం 2’ : ది రిజంప్షన్’ సీక్వెల్ కూడా అదే రేంజ్‌లో సక్సెస్ సాధించింది. మోహన్‌లాల్‌తో పాటు ఒరిజినల్ కాస్ట్ మళ్లీ తమ పాత్రల్లో రీ-ఎంటర్ ఇచ్చారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్‌గా రిలీజ్ అయి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

థియేటర్ రిలీజ్ లేకపోయినా, ఈ సీక్వెల్ ఓటీటీలో సంచలనం సృష్టించింది. ఈ రెండు సినిమాలూ ఇండియాలోని ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి, ముఖ్యంగా బాలీవుడ్‌లో అజయ్ దేవ్‌గణ్ లీడ్ రోల్‌లో నటించిన రీమేక్ సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ మూడో దృశ్యం ఇంకే రేంజ్ లో జనాన్ని థ్రిల్ చేస్తుంది? అన్నది చూడాలి.

Tags:    

Similar News