శేఖర్ కమ్ములకు చిరంజీవి శుభాకాంక్షలు

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు పొందారు.;

By :  S D R
Update: 2025-06-03 11:40 GMT

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం చిరంజీవి శేఖర్‌ కమ్ముల‌పై సోషల్ మీడియాలో హృద్యమైన పోస్ట్‌ చేశారు.

"మై డియర్ శేఖర్.. మీలాంటి అభిమాని ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ సినీ ప్రయాణానికి నేను స్ఫూర్తినిచ్చానని తెలుసుకుని గర్వంగా ఉంది. మీ 25 ఏళ్ల జర్నీలో ఒక భాగంగా నేను ఉన్నందుకు సంతోషంగా ఉంది" అంటూ చిరు ఎమోషనల్‌గా స్పందించారు.

శేఖర్ కమ్ముల సినిమాల శైలిని ప్రశంసించిన చిరు – "సున్నితమైన వినోదంతో పాటు సోషల్ మెసేజ్ కలిపి ఆలోచనాత్మకంగా సినిమాలు తీయడం మీ ప్రత్యేకత. ఫిలిం మేకింగ్‌లో మీదైన శైలిని స్థాపించుకున్నారు. ఇలాగే మరో 25 ఏళ్లూ మంచి చిత్రాలు చేస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా" అని చెప్పారు.

ఈ సందర్భంగా చిరంజీవి శేఖర్‌ కమ్ములకు ఓ ప్రత్యేక పెన్‌ను బహుమతిగా అందించారు. మెగాస్టార్‌ను కలిసిన ఫోటోలను శేఖర్‌ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ, చిరంజీవి నుంచి స్ఫూర్తి పొందిన వ్యక్తిగా తన జర్నీని ఆయన సమక్షంలో జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్‌, నాగార్జునలతో కలిసి ‘కుబేర’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం జూన్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక చిరంజీవి ‘విశ్వంభర’తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మెగా 157'తో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News