బీసీలకు 42% రిజర్వేషన్పై తెలంగాణ ప్రభుత్వం తర్జనభర్జన
రాష్ట్రపతి స్పందన లేకపోతే సుప్రీంకోర్టుకేనా? – తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలో మార్పులు;
By : Dasari Suresh
Update: 2025-06-27 11:42 GMT
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై తెలంగాణలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ బీసీలకు ఎలా ఇవ్వాళ అని తెలంగాణ ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది.పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ గురించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలి అని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.ఈ విషయంపై తెలంగాణ సర్కార్ అధికారులూ, న్యాయ సలహాదారుల సూచనలతో ముందడుగు వేస్తోంది. అయినా ఈ విషయంపై స్పష్టత లేకుండా కొనసాగుతోంది.
ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం జరిగిందా లేదా అనేది స్పష్టంగా తెలియాల్సిన విషయం. రాష్ట్రపతి నుంచి స్పందన లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేక బీసీ రిజర్వేషన్ లేకుండానే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలా అని రేవంత్ సర్కార్ ఆలోచిస్తునట్టు తెలుస్తుంది.