టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య… దర్యాప్తులో చిక్కడపల్లి పోలీసులు
ప్రాణాలు తీసిన మౌన బాధ... స్వేచ్ఛ సూసైడ్ మిస్టరీ;
టీ న్యూస్లో యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జవహర్నగర్లోని తన ఇంట్లో స్వేచ్ఛ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఈ సంఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం అధికారులు చర్యలు తీసుకున్నారు. స్వేచ్ఛ, తన తల్లి శ్రీదేవితో కలిసి రాంనగర్లో నివాసం ఉంటున్నారు.
ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.స్వేచ్ఛ ఎంతో ధైర్యవంతురాలు... ఆమె ఇలా ఎందుకు చేసిందా అని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని వాపోతున్నారు. ఆమె జీవితంలో అంతటి బాధ ఏదైనా ఉందా? అంటూ ఆమె స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులను విచారిస్తున్నారు. ఆత్మహత్యకు పక్కా కారణం ఏదైనా ఉందా? లేక ఇది ఆత్మస్థైర్య లోపం వల్ల జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.