గుడివాడలో ప్రత్యక్షమైన మాజీ మంత్రి కొడాలి నాని – కోర్టుకు హాజరు
కోర్టు సమీపంలో కొడాలి నానిని చూసేందుకు తరలివచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు;
ఆరోగ్యరీత్యా ఈమధ్య కోడలి నాని వైసీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.సుదీర్ఘ విరామం తర్వాత మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని) గుడివాడలో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల చోటుచేసుకున్న ఒక దాడి కేసులో యాంటిసిపేటరీ బెయిల్ (ముందస్తు బెయిల్) కోసం నాని కోర్టుకు హాజరయ్యారు.
ఎన్నికల అనంతరం ఏకంగా ఏడాది తర్వాత గుడివాడలో కనిపించని నాని ,ఈ కేసు నేపథ్యంలో , ప్రజల్లో ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది.మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో నాని హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు కింద కోర్టులో బెయిల్ పొందాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో, శుక్రవారం నాడు ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకు కొడాలి నాని హాజరయ్యారు. ఇప్పటికే ఇదే కేసులో 16 మంది అనుచరులు బెయిల్ పై విడుదల అయ్యారు.పోలీసుల దర్యాప్తులో, కొడాలి నాని చెప్పినదే ప్రభావితమై దాడికి పాల్పడ్డామని పలువురు అనుచరులు అంగీకరించినట్లు సమాచారం.కొడాలి నాని కోర్టుకు హాజరవుతున్నారన్న వార్త తెలియగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.