వైసీపీకి షాక్ ఇచ్చిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీకి మనుగడ లేదు అంటున్న మాజీ మంత్రలు, ఎమ్మెల్యేలు;
వైసీపీ నుంచి ఒక్కొకరుగా పార్టీకి రాజీనామా చేస్తున్నరు, దీనికి ప్రధాన కారణం వైసీపీ పార్టీ వైఖరి.ఇటీవల జగన్ పార్టీ నిర్వహిస్తున్న కార్యకలాపాలే దీనికి కారణం, జగన్ అండ్ కో చేస్తున్న దుశ్చర్యలకు పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులకు నచ్చక పార్టీ నుంచి ఒక్కొకరుగా దూరం అవుతున్నారు.
ఇప్పుడు సీనియర్ నాయకులు గత వైసీపీ ప్రభుత్వంలో రెవిన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రషన్ మంత్రిగా పని చేసిన ధర్మాన ప్రసాదరావు గారు వైసీపీ పార్టీని వీడనున్నట్టు తెలుస్తుంది.రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రసాదరావు గారు శ్రీకాకుళం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.దివంగత వైస్ రాజశేఖర్ రెడ్డి ,కిరణ్ కుమార్ రెడ్డి మరియు చంద్రబాబు కాబినెట్ లో మంత్రి పదవులు చేసారు.
2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ లో చేరి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి చెందారు,2019 లో మరలా వైసీపీ పార్టీ తరుపున శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.సీనియర్ నాయకులుగా సుదీర్ఘ అనుభవం ఉన్న ధర్మానకు అప్పటి వైసీపీ ప్రభుత్వం మంత్రి పదవి అప్పగించింది.
ప్రస్తుతం అయన వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు,దీనికి వైసీపీ చేస్తున్న నీచ రాజకీయాలు నచ్చక దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది, ఈ మధ్య ధర్మాన వైసీపీ కార్యక్రమాలకి దేనికి హాజరైన దాఖలాలు లేవు.పార్టీ నడవడిక నచ్చక ధర్మాన పార్టీని వీడుతున్నట్టు తెలుస్తుంది.వైసీపీలో సీనియర్ నాయకులు అందరూ దూరం అవ్వటం వైసీపీ పార్టీ భవిష్యత్తు ఏమిటి అనేది పార్టీ అధ్యక్షుల వారికే తెలియాలి.