నేర సమీక్ష కార్యక్రమంలో చిత్తూర్ జిల్లా ఎస్పీ పోలీసులకు పలుసూచన్లు
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చిత్తూరులో నేరసమీక్ష కార్యక్రమం;
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఈ రోజు లిప్స్ పోలీసింగ్ స్కిల్ల్స్, విజిబుల్ పోలీసింగ్ పెంచే విధంగా పని చేయాలి అని , ప్రజలతో సామరస్యంగా, సఖ్యతతో చట్టం పై గౌరవం పెంపొందేటట్లు మెలగాలి అని , అక్రమ రవాణ నేరస్తుల పై ఉక్కు పాదం మోపాలి అని.,పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ద వహించి త్వరితగతిన పరిష్కరించాలి అన్నారు.
సీసీఎన్ టిఎస్ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఇంచార్జ్ అడ్మిన్ శ్రీ ఎస్.ఆర్.రాజశేఖర రాజు, జిల్లాలోని సబ్ డివిజన్ డి.ఎస్పీ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఆర్.ఐ.లు మరియు ఎస్.ఐ.లు పాల్గొన్నారు.
CCTNS (Crime and Criminal Tracking Network and Systems) డేటాను తక్షణమే మరియు క్రమం తప్పకుండా నవీకరిస్తూ ఉండి. ప్రతి మార్పును సీసీఎన్ టిఎస్ డేటాలో వెంటనే నమోదు చేసి, అప్డేట్ చేయాలి చెప్పారు. సీసీఎన్ టిఎస్ వ్యవస్థలో డేటాను ఎప్పటికప్పుడు సరైన విధంగా అప్డేట్ చేయడం తప్పనిసరిగా జరగాలిఅన్నారు. క్రైమ్ మరియు క్రిమినల్ వివరాలను సీసీఎన్ టిఎస్లో నిరంతరంగా నవీకరిస్తూ ఉండాలి అని పోలీసులకు తెలియచేసారు.
అసాంఘిక కార్యకలాపాల అణచివేతకు డ్రోన్ ల సహాయంతో నిఘా పెంచాలి అని ఆదేశించారు. ఇప్పటికే సిబ్బందికి డ్రోన్ శిక్షణ ఇవ్వడం జరిగింది అని చెప్పారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నేర పరిశోధన, శాంతి భద్రతల పరిరక్షణ, భారీ సమావేశాల్లో భద్రతా చర్యలు తీసుకోవడం వంటి విభిన్న దశల్లో డ్రోన్లు ఉపయోగపడుతాయి అని ముఖ్యంగా పెద్ద ఎత్తున జరిగే సభలు, ర్యాలీలు, ట్రాఫిక్ కంట్రోల్, అటవీ ప్రాంతాల పర్యవేక్షణ, కల్తీ మద్య తయారీ స్థలాల గుర్తింపు వంటి విభాగాల్లో డ్రోన్ లు సహాయపడుతాయి అన్నారు.
పెండింగ్ లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, 174 Crpc కేసులు, మిస్సింగ్, చీటింగ్, 102 Cr.P.C, IT act కేసులు, సైబర్ నేరాలు మరియు ఇతర కేసులను సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్, రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు.
కేసు నమోదు అయిన తర్వాత కోర్టులో నిందితులకు జైలు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకున్నప్పుడే బాధితులకు సరైన న్యాయం చేసినట్లు అవుతుందని పోలీస్ అధికారులకు సూచించారు. ఏదైనా దొంగతనం జరిగిన వెంటనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, నేరస్థుడు వదిలిన సాక్ష్యాదారాలు, సిసి కెమెరాల ఫుటేజీలను క్రోడీకరించి ముద్దాయిలను పట్టుకొని, వారి వద్ద నుండి పూర్తిమొత్తంలో దొంగిలించబడిన సొమ్ము రికవరీ చేయాలన్నారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరు సాంకేతికంగా అవగాహన కలిగి ఉండాలని అజ్ఞాత వ్యక్తుల నుండి వచ్చే సంక్షిప్త సమాచారాలు, మెయిల్స్ లలోని లింకులను ఓపెన్ చేయకుండా తిరస్కరించాలి. పొరపాటున లింక్ లను క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలో నగదు మొత్తం మాయం అయ్యే ప్రమాదం ఉంది. యాప్ ద్వారా లోన్ ఇస్తామని ఫోన్ చేసిన వాటిని తీసుకోకూడదు. వాటి వెనక ప్రమాదం ఉందనే విషయాన్ని గ్రహించాలి.
ఎవరైనా మోసపోయాం అని గ్రహించిన తక్షణమే Cyber Helpline 1930 కు గాని సైబర్ రిపోర్టింగ్ పోర్టల్ http://cybercrime.gov.in/ కు గాని జిల్లా పోలీస్ వాట్సప్ప్ నెంబర్ 9440900005 కు గాని, సైబర్ మిత్ర 9121211100 కు వెంటనే తెలపాలి అన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తూ పొలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని, మహిళలు/చిన్నారుల సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పదించాలని, పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు.
క్రైమ్ మీటింగ్ అనంతరం నగరి సబ్-డివిజన్ పరిధిలో వివిధ కేసులను చేదించి, ఆయా కేసులలో ఆస్తిని రికవరీ చేయడంలో చూపిన అచంచలమైన నిబద్ధతకు జిల్లా ఎస్పీ గారు క్యాష్ రివార్డ్ మరియు సర్టిఫికేట్ ఇచ్చి అభినందించారు.