వెంకీ కోసం ఇద్దరు వెయిటింగ్

చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న కాంబో వెంకటేష్-త్రివిక్రమ్ లది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచనలో వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి' సినిమాలు మంచి విజయాలు సాధించాయి.;

By :  S D R
Update: 2025-05-03 09:48 GMT

చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న కాంబో వెంకటేష్-త్రివిక్రమ్ లది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచనలో వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పటికీ ఈ చిత్రాలకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది.

ఈ సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు వెంకీ. ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకటేష్ నెక్స్ట్ మూవీని ఇంకా అనౌన్స్‌ చేయలేదు. లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం వెంకీ తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ తోనే చేయబోతున్నాడట.

అసలు త్రివిక్రమ్.. తన నెక్స్ట్ మూవీని అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. అయితే.. అల్లు అర్జున్ సినిమా మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కనుంది. దీంతో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కోసం మరో సంవత్సరమైనా సమయం పడుతుంది. ఈలోపులో వెంకటేష్ మూవీని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట మాటల మాంత్రికుడు. త్వరలోనే వెంకీ-త్రివిక్రమ్ కాంబోపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు వెంకటేష్ తోనే సినిమా చేస్తానంటున్నాడు ‘హిట్‘ డైరెక్టర్ శైలేష్ కొలను. ‘హిట్‘ సిరీస్ తో సూపర్ హిట్స్ అందుకున్న శైలేష్.. గతంలో వెంకటేష్ తో ‘సైంధవ్‘ తెరకెక్కించాడు. కానీ.. ఆ చిత్రం ఘోరంగా పరాజయం పాలైంది. ఈనేపథ్యంలో ఇప్పుడు వెంకీకి ఎలాగైనా హిట్ ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు శైలేష్. మరి.. వెంకీ తర్వాతి చిత్రం త్రివిక్రమ్, శైలేష్ కొలను లలో ఎవరితో సెట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News