మెగా 157 ముస్సోరీ షెడ్యూల్ పూర్తి !
ఇటీవలే నయనతార ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. అంతలోనే టీమ్ రెండో షెడ్యూల్ని ఉత్తరాఖండ్లోని మస్సూరీ హిల్ స్టేషన్లో కంప్లీట్ చేసినట్టు అఫీషియల్ గా ప్రకటించి షాకిచ్చింది.;
మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్స్టార్ నయనతార జోడీగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తు్న్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. చిరు, నయనతార మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. గతంలో "సై రా నరసింహారెడ్డి"లో హిస్టారికల్ డ్రామాలో, "గాడ్ఫాదర్"లో యాక్షన్-పొలిటికల్ థ్రిల్లర్లో కలిసి మెస్మరైజ్ చేసిన ఈ జంట, ఇప్పుడు కొత్త సినిమాతో రాక్ చేయడానికి రెడీ అవుతోంది.
ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాను మెగా 157గా పిలుచుకుంటున్నారు. ఇటీవలే నయనతార ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. అంతలోనే టీమ్ రెండో షెడ్యూల్ని ఉత్తరాఖండ్లోని ముస్సోరీ హిల్ స్టేషన్లో కంప్లీట్ చేసినట్టు అఫీషియల్ గా ప్రకటించి షాకిచ్చింది. అక్కడి కూల్ వాతావరణంలో హై-ఎనర్జీ సీన్స్ని, మెగాస్టార్ చిరంజీవి డైనమిక్ పెర్ఫార్మెన్స్తో షూట్ చేశారు. టీమ్ సోషల్ మీడియాలో ఒక కూల్ అప్డేట్ డ్రాప్ చేసింది: “ముస్సోరీలో మెగా157 టీమ్ రెండో షెడ్యూల్ని సూపర్ ఎనర్జిటిక్ సీన్స్ ను చిరంజీవి బ్లాస్టింగ్ పెర్ఫార్మెన్స్తో రాక్ చేసి ముగించింది..” అని పోస్ట్ చేశారు.
అయితే.. ఈ అప్డేట్లో షేర్ చేసిన ఫోటోలో చిరంజీవి, నయనతార లుక్స్ని బ్లర్ చేసి, డైరెక్టర్ అనిల్ రావిపూడిని స్పాట్లైట్లో ఉంచారు. ఈ సస్పెన్స్ ఫ్యాన్స్లో క్యూరియాసిటీని మరింత పెంచేసింది. ఈ సినిమా పక్కా ఫన్-ఫిల్డ్ ఎంటర్టైనర్గా రూపొందుతోందని టాక్. అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో పాటు చిరంజీవి స్టార్డమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. నయనతార గ్లామర్, టాలెంట్ సినిమాకి మరో హైలైట్ అవుతాయని అంటున్నారు. ఇంకా, ఈ సినిమాలో కేథరిన్ ట్రెసా మరో ముఖ్యమైన రోల్లో జోడవడం విశేషం. ఆమె క్యారెక్టర్ గురించి ఇంకా డీటెయిల్స్ రాలేదు. కానీ సినిమాకి ఎక్స్ట్రా డోస్ ఎనర్జీ యాడ్ అవుతుందని టీమ్ హింట్ ఇచ్చింది.