మైసూర్ శాండిల్ సోప్ వివాదంలో తమన్నా

ఇటీవల, ఆమె కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని మైసూర్ సాండల్ సోప్ బ్రాండ్‌తో ఒక భారీ ఎండార్స్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 6.2 కోట్ల రూపాయల విలువైనది. సర్టెన్ టైమ్ పీరియడ్ కోసం ఆమె ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది.;

By :  K R K
Update: 2025-05-24 13:15 GMT

మిల్కీబ్యూటీ తమన్నా భాటియా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ రంగంలో అను భవజ్ఞురాలు. ఆమె అనేక జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లకు అంబాసిడర్ గా వ్యవహరించి తన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, విస్తృతమైన ఫ్యాన్ బేస్ తో బ్రాండ్‌లను విజయవంతంగా ప్రమోట్ చేసింది. ఇటీవల, ఆమె కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని మైసూర్ సాండల్ సోప్ బ్రాండ్‌తో ఒక భారీ ఎండార్స్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 6.2 కోట్ల రూపాయల విలువైనది. సర్టెన్ టైమ్ పీరియడ్ కోసం ఆమె ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది.

మైసూర్ సాండల్ సోప్, కర్ణాటకలో ఒక గర్వకారణమైన బ్రాండ్. దాని సుగంధ చందన సబ్బుతో దేశవ్యాప్తంగా పేరుగాంచింది. ఈ ఒప్పందం ఉత్తర భారతదేశ మార్కెట్లలో బ్రాండ్‌ను మరింతగా ప్రమోట్ చేయడానికి ఒక వ్యూహాత్మక అడుగుగా భావించబడుతోంది. ఎందుకంటే తమన్నా ఉత్తర భారతదేశంలో విస్తృతమైన అభిమాన ఆదరణ కలిగి ఉంది. అయితే, ఈ ఒప్పందం ప్రకటన వెలువడిన వెంటనే.. ప్రాంతీయ భావోద్వేగాలతో కూడిన వివాదం తలెత్తింది. కర్ణాటకలోని ప్రతిపక్ష పార్టీలు, కొన్ని కన్నడ సాంస్కృతిక సంఘాలు తమన్నాను ఈ బ్రాండ్‌కు ఎంచుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

వారి వాదన ఏమిటంటే.. తమన్నా కన్నడిగ కాకపోవడం వల్ల, కర్ణాటక సంస్కృతి గుర్తింపును సూచించే మైసూర్ సాండల్ సోప్ లాంటి ఐకానిక్ బ్రాండ్‌కు ఆమె అంబాసిడర్‌గా ఉండటం సముచితం కాదంటున్నారు. కన్నడ సినిమా నటులు లేదా కన్నడిగ సెలెబ్రిటీలలో ఒకరిని ఎంచుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో ప్రాంతీయ భావోద్వేగాలు మరియు గుర్తింపుకు సంబంధించిన వివాదాలు కొత్తవి కావు.

కొందరు తమన్నా ఎంపికను సమర్థిస్తూ, ఆమె జాతీయ స్థాయి ప్రముఖత, మార్కెట్ ఆకర్షణ బ్రాండ్‌కు లాభదాయకమని వాదిస్తుండగా, మరికొందరు స్థానిక సెలెబ్రిటీలను ఎంచుకోవాలని నొక్కి చెబుతున్నారు. ఈ పరిణామాలు తమన్నా భాటియా కెరీర్‌తో పాటు, మైసూర్ సాండల్ సోప్ బ్రాండ్ ఉత్తర భారత మార్కెట్ విస్తరణ వ్యూహంపై కూడా ప్రభావం చూపనున్నాయి.

Tags:    

Similar News