20 ఏళ్ళ తర్వాత మళ్లీ సూర్య అండ్ త్రిష

20 సంవత్సరాల తర్వాత సూర్య, త్రిష జోడీ మళ్లీ కలిసి నటిస్తున్నారనే ప్రత్యేకత ఈ చిత్రానికి ఉంది. ‘ఆరు’ సినిమాలో ఈ ఇద్దరూ చివరి సారిగా నటించారు.;

By :  K R K
Update: 2025-06-21 01:15 GMT

సూర్య హీరోగా.. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెరైటీ చిత్రం 'కరుప్పు'. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఇది వీరిద్దరి కెరీర్‌లోనూ ఒక మాగ్నం ఓపస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. బాలాజీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ పోస్టర్ విడుదల చేశారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన సినిమాగా రూపొందుతోంది.

20 సంవత్సరాల తర్వాత సూర్య, త్రిష జోడీ మళ్లీ కలిసి నటిస్తున్నారనే ప్రత్యేకత ఈ చిత్రానికి ఉంది. ‘ఆరు’ సినిమాలో ఈ ఇద్దరూ చివరి సారిగా నటించారు. సూర్య, త్రిష ఇప్పటివరకు చూడని కొత్త గెటప్‌లలో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇంద్రన్స్, నట్టి, శ్వాసిక, అనఘ మాయ రవి, శివద, సుప్రీత్ రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ఎన్నో హిట్స్ అందించిన యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అన్బరివ్, విక్రమ్ మోర్ జోడీలు 'కరుప్పు'లో క్వాలిటీ యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు. అవార్డు గ్రహీత ప్రొడక్షన్ డిజైనర్ అరుణ్ వెంజారమూడ్ ఈ భారీ చిత్రం కోసం అద్భుతమైన సెట్‌లను రూపొందించారు. 'కరుప్పు' చిత్రీకరణ చివరి దశ లో ఉంది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

Tags:    

Similar News