సింబు సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ ?

‘మానాడు’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతోంది. త్వరలోనే మానాడు 2 కు సన్నాహాలు జరుగుతున్నాయి. సింబు, వెంకట్ ప్రభు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారని, వాళ్ల ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తయిన వెంటనే మానాడు 2 సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.;

By :  K R K
Update: 2025-06-25 01:48 GMT

కోలీవుడ్ స్టార్ సింబు.. ఒకప్పుడు వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ కెరీర్‌లో బాగా ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో, మానాడు అనే సినిమా అతనికి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సై-ఫై టైమ్‌లూప్ థ్రిల్లర్, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక, బాక్సాఫీస్ వద్ద రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సినిమా కథ, స్క్రీన్‌ప్లే, టెక్నికల్ అస్పెక్ట్స్ అన్నీ సూపర్ క్లాస్‌గా ఉండటంతో, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఓటీటీలో ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా బాగా క్లిక్ అయింది. తమిళ సినిమా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మూవీని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు. సింబు తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంతా మెచ్చుకున్నారు. అలాగే, ఎస్‌జె సూర్య తన విలన్ రోల్‌తో అదరగొట్టేశాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.

ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ ఏంటంటే ‘మానాడు’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతోంది. త్వరలోనే మానాడు 2 కు సన్నాహాలు జరుగుతున్నాయి. సింబు, వెంకట్ ప్రభు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారని, వాళ్ల ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తయిన వెంటనే మానాడు 2 సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. సింబు ప్రస్తుతం డ్రాగన్ ఫేమ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తుతో ఒక సినిమా, ఆస్కార్ గెలిచిన దర్శకుడు వెట్రిమారన్‌తో మరో ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. ఇక వెంకట్ ప్రభు విషయానికి వస్తే, అతను శివకార్తికేయన్ తో ఓ కొత్త సినిమాపై వర్క్ చేస్తున్నాడు. మరి మానాడు 2 ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News