తన కంఫర్ట్ జోన్ లోకి మళ్ళీ మణిరత్నం !
మణిరత్నం ఇప్పుడు న్యూ-జెన్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ ఓ కాంటెంపరరీ లవ్స్టోరీ స్క్రిప్ట్ని రెడీ చేస్తున్నారని బజ్.;
లెజెండరీ ఫిల్మ్మేకర్ మణిరత్నం ఇప్పుడు మరోసారి తన కంఫర్ట్ జోన్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన త్వరలో ఒక అదిరిపోయే లవ్స్టోరీని డైరెక్ట్ చేయబోతున్నారట. గతంలో సెట్బ్యాక్స్ ఎదురైనప్పుడల్లా.. యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీస్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు మణిరత్నం. ‘సఖి’, ‘ఒకే బంగారం’ లాంటి సినిమాలు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. తాజాగా కమల్ హాసన్, సింబు కాంబోలో వచ్చిన ‘థగ్ లైఫ్’ అంతగా ఆకట్టుకోలేదు. ఈ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడేందుకు, మణిరత్నం ఇప్పుడు న్యూ-జెన్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ ఓ కాంటెంపరరీ లవ్స్టోరీ స్క్రిప్ట్ని రెడీ చేస్తున్నారని బజ్.
ఈ సినిమా టోటల్ యూత్ఫుల్ వైబ్తో, ప్రెజెంట్ జనరేషన్ రొమాన్స్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుందట. ప్రాజెక్ట్ ఇంకా తొలి దశలోనే ఉన్నప్పటికీ, కాస్టింగ్ గురించి ఊహాగానాలు ఫుల్ స్పీడ్లో ఉన్నాయి. హీరో రోల్ కోసం సింబు, నవీన్ పొలిశెట్టి పేర్లు హాట్ టాపిక్గా మారాయి. హీరోయిన్గా రుక్మిణి వసంత్తో డిస్కషన్స్ జరుగుతున్నాయని టాక్. కానీ, మణిరత్నం స్టైల్ వేరు కదా. షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు కాస్టింగ్ని మార్చి మార్చి ఫైనల్ చేసే అలవాటు ఆయనది. సో.. ఫైనల్ లైనప్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
‘థగ్ లైఫ్’కి వచ్చిన రెస్పాన్స్పై మణిరత్నం ఓపెన్ అయ్యి.. ఆడియన్స్ కు సారీ చెప్పారు. ఇది ఆయన సిన్సియారిటీని చూపిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త లవ్స్టోరీతో, తన కోర్ స్టోరీటెల్లింగ్ స్ట్రెంగ్త్తో మళ్లీ ఆడియన్స్ ను ఆకట్టుకోడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా ద్వారా మణిరత్నం మరోసారి తన మార్క్ సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ డెప్త్తో అదరగొట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే హైప్ మొదలైంది. మరి ఈ లవ్స్టోరీ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.