నిఖిల్ సినిమా సెట్లో ఘోర ప్రమాదం!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ది ఇండియా హౌస్'. పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.;
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ది ఇండియా హౌస్'. పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, సముద్ర దృశ్యాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా కూలిపోవడంతో సెట్ మొత్తం నీటిలో మునిగిపోయింది.
ఈ ప్రమాదంలో ఒక అసిస్టెంట్ కెమెరామెన్కు తీవ్ర గాయాలవ్వగా, మరికొంతమంది సాంకేతిక సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో నిఖిల్ సెట్లో ఉన్నారా అనే విషయంపై స్పష్టత లేదు.
ప్రమాదానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్ర బృందం ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతానికి షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం.
ఈ చిత్రానికి రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ - సయీ మంజ్రేకర్ జంటగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రామ్ చరణ్ సమర్పణలో, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.