అక్కినేని ఫ్యామిలీని గాలికొదిలేశారా?
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో అక్కినేని కుటుంబ కథానాయకులు నటించిన సినిమాలకు ఎలాంటి అవార్డులు దక్కలేదు. ఈ విషయంపైనా సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన పదేళ్లలో అక్కినేని కుటుంబం నుంచి ‘మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి, ఒక లైలా కోసం, బంగార్రాజు, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ‘ వంటి సినిమాలు వచ్చాయి.
అయితే వీటిలో ‘మనం‘ చిత్రానికి అవార్డు రావాలి. కానీ.. ప్రస్తుతం ప్రకటించిన అవార్డులను 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను మాత్రమే తీసుకున్నారు. ‘మనం‘ చిత్రం 2014, మే 23న విడుదలైంది. దీంతో ‘మనం‘ చిత్రానికి అవార్డు రాలేదనేది ఒక వాదన.
మొత్తంగా.. తెలంగాణ ప్రభుత్వానికి, అక్కినేని కుటుంబానికి ఆమధ్య జరిగిన కొన్ని విషయాలు కారణంగానే ఆ కుటుంబాన్ని విస్మరించారా? అనేది కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాలుగా చెబుతున్నారు.