దేవిశ్రీ మళ్లీ వివాదంలో!
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్టులో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పేరు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా స్టార్ హీరోలకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఎస్.పి.;
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్టులో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పేరు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా స్టార్ హీరోలకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఎస్.పి. అయితే ఈమధ్య కాలంలో దేవిశ్రీ చుట్టూ వివాదాలు చేరుతున్నాయి.
'పుష్ప 2' సంగీతం విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరకు అది సద్దుమణగడం సినిమా సూపర్ హిట్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ 'కుబేర' విషయంలో దేవిశ్రీప్రసాద్ హాట్ టాపిక్ గా మారాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీత దర్శకుడు. అయితే రిలీజ్ కి పదిరోజులే మిగిలి ఉండగా ఇంకా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ వర్క్ పెండింగ్లో ఉందని నిర్మాత సునీల్ నారంగ్ వెల్లడించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
మూడేళ్ల క్రితమే అనౌన్స్ చేసిన ఈ చిత్రానికి సంబంధించి ఇంకా మ్యూజిక్ వర్క్ పెండింగ్ ఉండటం ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డి.ఎస్.పి. అనుకున్న సమయానికి అవుట్ పుట్ ఇవ్వడం లేదనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే 'కుబేర' నుంచి రెండు పాటలు రాగా.. ఈరోజు మూడో పాట విడుదలకానుంది. జూన్ 20న 'కుబేర' విడుదలకు ముస్తాబవుతుంది.