‘టైగర్ వర్సెస్ పఠాన్’ మూవీ ఆగిపోలేదు !
ముంబై ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వచ్చిన ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం.. వైఆర్ఎఫ్ బాస్ అదిత్య చోప్రా ప్రస్తుతం స్పై యూనివర్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేందుకు కథను, క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్స్ను మరింత జోష్గా రీడిజైన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.;
సూపర్ స్టార్స్ .. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లతో.. ‘టైగర్ వర్సెస్ పఠాన్’ అనే మెగా ప్రాజెక్ట్ను యశ్ రాజ్ ఫిల్మ్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా కొన్ని రూమర్స్ ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని చెప్పినా, లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ లో డవలప్ అవుతోందని తెలుస్తోంది.
ముంబై ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వచ్చిన ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం.. వైఆర్ఎఫ్ బాస్ అదిత్య చోప్రా ప్రస్తుతం స్పై యూనివర్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేందుకు కథను, క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్స్ను మరింత జోష్గా రీడిజైన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’ లాంటి బ్లాక్బస్టర్స్తో స్పై యూనివర్స్ రచ్చ చేస్తోంది. ఇప్పుడు ‘టైగర్ వర్సెస్ పఠాన్’ ఈ యూనివర్స్లో గేమ్ ఛేంజర్గా మారనుంది.
సల్మాన్ ఖాన్ ‘టైగర్’ గానూ, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ గానూ స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఈ మూవీ బాలీవుడ్లో ఒక ఎపిక్ సినిమాటిక్ ఈవెంట్ అవ్వబోతోంది. ఈ ఇద్దరు సూపర్స్టార్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం అభిమానులకు ఫుల్ జోష్ కిక్ ఇవ్వబోతోంది. ఈ సినిమా కేవలం స్టాండ్లోన్ మూవీగా కాకుండా, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ను మరింత బిగ్గర్ అండ్ బెటర్గా మార్చే కీలక సినిమా కాబోతోంది. కథ, స్క్రీన్ప్లే, ఇతర సినిమాలతో లింక్లను అదిత్య చోప్రా టీమ్ సూపర్ థ్రిల్లింగ్గా డిజైన్ చేస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ డ్రాప్ అవ్వొచ్చని ఇండస్ట్రీ టాక్.