బాలీవుడ్ ‘రామాయణం’ షూటింగ్ పూర్తి !
రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి రోజు ఎమోషనల్ మూమెంట్స్తో నిండిపోయింది. శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణ్బీర్ కపూర్, ఇది తన కెరీర్లో "అత్యంత ముఖ్యమైన పాత్ర" అని, టీమ్కి కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.;
ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో ఒకటైన నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణం సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి రోజు ఎమోషనల్ మూమెంట్స్తో నిండిపోయింది. శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణ్బీర్ కపూర్, ఇది తన కెరీర్లో "అత్యంత ముఖ్యమైన పాత్ర" అని, టీమ్కి కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సినిమా మేకర్స్ ఇప్పుడు జులై 3, 2025న మొదటి అధికారిక గ్లింప్స్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 'రామాయణం: ది ఇంట్రడక్షన్' అనే టైటిల్తో పోస్టర్, లోగోను గ్రాండ్గా ఆవిష్కరించనున్నారు. టీజర్ సిద్ధంగా ఉన్నప్పటికీ, సెన్సార్ బోర్డ్ ఆమోదం పొందినప్పటికీ, సినిమా విడుదలకు ఇంకా ఏడాది కంటే ఎక్కువ సమయం ఉండటంతో దాన్ని వాయిదా వేశారు. 'దంగల్', 'చిచ్చోరే' ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ రామాయణం రెండు భాగాలుగా వస్తోంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.
సాయి పల్లవి (సీత), యష్ (రావణుడు), సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు), లారా దత్తా (కైకేయి), రకుల్ ప్రీత్ సింగ్ (శూర్పణఖ), కాజల్ అగర్వాల్ (మండొదరి) లాంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ఉంది. షూటింగ్ కంప్లీషన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారీ స్కేల్లో రూపొందుతున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ని ఆస్కార్ విన్నింగ్ స్టూడియో డీయన్ఈజీ హ్యాండిల్ చేస్తోంది. అలాగే, అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీతో సినిమాని పలు భాషల్లో నేటివ్ లిప్-సింక్తో గ్లోబల్ ఆడియెన్స్కి అందించే ప్లాన్లో ఉన్నారు. మొదటి లుక్కి ఇంకా కొన్ని రోజులే ఉండటంతో ఫ్యాన్స్లో ఉత్కంఠ నెలకొంది. ‘రామాయణం’ కేవలం సినిమా మాత్రమే కాదు. భారతీయ సంస్కృతితో ముడిపడిన ఒక గ్రాండ్ సినిమాటిక్ ఈవెంట్గా గ్లోబల్ ఆడియెన్స్ని ఆకట్టుకోనుంది.