సోనాక్షి ‘నికితారాయ్’ మూవీకి కొత్త రిలీజ్ డేట్
మొదట ఈ మూవీ ఈ ఏడాది జూన్ 27 న థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ డేట్ను జూలై 18 కి షిఫ్ట్ చేశారు.;
సోనాక్షి సిన్హా హీరోయిన్గా నటిస్తున్న రాబోయే సూపర్న్యాచురల్ బాలీవుడ్ థ్రిల్లర్ ‘నికితా రాయ్’. ఈ సినిమా టీమ్.. విడుదల తేదీ మార్పు గురించి ఓ బిగ్ అప్డేట్ డ్రాప్ చేసింది. మొదట ఈ మూవీ ఈ ఏడాది జూన్ 27 న థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ డేట్ను జూలై 18 కి షిఫ్ట్ చేశారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో సూపర్ ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ చేంజ్ వారికి కాస్త డిసప్పాయింట్మెంట్ అయినా, నిర్మాతలు దీని వెనక ఉన్న స్ట్రాంగ్ రీజన్ను ఓ అధికారిక స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పారు.
"హాయ్ గైస్.. మా సినిమా ‘నికితారాయ్’ రిలీజ్ టైమ్లో చాలా సినిమాలు క్లాష్ అవుతున్నాయి, స్క్రీన్స్ కోసం కూడా టఫ్ కాంపిటీషన్ రన్ అవుతోంది. మా ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్తో చర్చించిన తర్వాత, మరింత ఎక్కువ మంది ఆడియన్స్ను రీచ్ చేయడానికి జూలై 18కి మా రిలీజ్ను పోస్ట్పోన్ చేయాలని డిసైడ్ చేశాం. ఇప్పటివరకు మీరు ‘నికితారాయ్’ పై చూపించిన క్రేజీ లవ్కి బిగ్ థ్యాంక్స్. కానీ, కొంచెం ఎక్కువ టైమ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కటి చెప్తున్నాం.. జూలై 18న థియేటర్లలో మీకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం.. ప్రామిస్! సీ యూ సూన్ ఇన్ థియేటర్స్..’’ అంటూ నిర్మాతలు తెలిపారు.
ఈ సూపర్న్యాచురల్ థ్రిల్లర్ కోసం ఫ్యాన్స్ లాంగ్ టైమ్ నుంచి హైప్లో ఉన్నారు. సోనాక్షి సిన్హాతో పాటు, ఈ మూవీలో పరేష్ రావల్, అర్జున్ రాంపాల్, సుహైల్ నయ్యర్ లాంటి స్ట్రాంగ్ కాస్ట్ ఉంది. నికితా రాయ్ కథాంశం సూపర్ గ్రిప్పింగ్గా, మిస్టీరియస్గా ఉంటుందని, ఆడియన్స్ను సీట్ ఎడ్జ్లో ఉంచేలా చేస్తుందని టీమ్ చెబుతోంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది కుష్ ఎస్. సిన్హా. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిమ్స్, నికితా పై ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లతో పాటు, బవేజా స్టూడియోస్, బ్లిస్ ఎంటర్టైన్మెంట్, మూవీస్ పీటీఈ లిమిటెడ్, కార్మిక్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.