పారా అథ్లెటిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ !
2025 సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు న్యూఢిల్లీలో జరిగే వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది.;
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ .. కంగనా రనౌత్ కొత్త పాత్రలో కనిపించనుంది. ఈ సారి సినిమాలు, రాజకీయాలకు అతీతంగా.. ఆమె 2025 సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు న్యూఢిల్లీలో జరిగే వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. ఈ ప్రకటన పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. ఇది 100కి పైగా దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొనే ఈ ఈవెంట్కు మరింత దృశ్యమానత తెచ్చేలా చేస్తుంది.
కంగనా ఈ ఛాంపియన్షిప్లో భాగం కావడం పట్ల గర్వంగా ఉన్నట్లు చెప్పింది. పారా-అథ్లెట్ల బలం, వారి కథనాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేయాలని ఆమె ఆకాంక్షిస్తోంది. ఆమెకు ఇది కేవలం ఒక టైటిల్ కాదు, అడ్డంకులను అధిగమించి అత్యున్నత స్థాయిలో పోటీపడే అథ్లెట్లకు సపోర్ట్ చేసే మార్గం.
ఈ ఛాంపియన్షిప్ భారతదేశంలో జరిగే అతిపెద్ద అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఒకటిగా ఉంటుందని అంచనా. కంగనా రనౌత్ ఈ ఈవెంట్లో చేరడం వల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ పెరిగి, తరచూ అర్హమైన గుర్తింపు పొందని అథ్లెట్లపై దృష్టి సారించే అవకాశం ఉంది. మరో క్యాంపెయిన్ లేదా బ్రాండ్ను ప్రమోట్ చేయడం కాకుండా, ఈ సారి కంగనా దృఢ సంకల్పంతో కూడిన ఒక గొప్ప ఈవెంట్కు ఫోకస్ తీసుకొస్తూ సమాజంలో మార్పు తెచ్చే పనిలో ఉంది.