భారీగా రిలీజ్ కాబోతున్న ‘హౌస్ ఫుల్ 5’

హౌస్ ఫుల్ 5’ మూవీ. భారతదేశంలో 5000 స్క్రీన్‌లలో జూన్ 6న విడుదల కానుంది.;

By :  K R K
Update: 2025-06-03 05:14 GMT

బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజీలో అతిపెద్ద రిలీజ్‌తో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది అక్షయ్ కుమార్ ‘హౌస్ ఫుల్ 5’ మూవీ. భారతదేశంలో 5000 స్క్రీన్‌లలో జూన్ 6న విడుదల కానుంది. ఇది ఈ సిరీస్‌లో ఒక అసాధారణ రికార్డు. అదే సమయంలో మణిరత్నం ‘థగ్ లైఫ్’ వంటి బలమైన పోటీ సినిమాలు ఉన్నప్పటికీ, ‘హౌస్‌ఫుల్ 5’ ఈ భారీ స్క్రీన్ కౌంట్‌ను సాధించగలిగింది. ఇప్పుడు కీలకం పాజిటివ్ టాక్ మాత్రమే. అది కానీ వస్తే బాక్స్ ఆఫీస్‌ వద్ద ఈ సినిమా దూసుకెళ్లడం ఖాయం.

రూ. 225 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘హౌస్‌ఫుల్ 5’... ఈ ఫ్రాంచైజీలో అతిపెద్ద పెట్టుబడి. నిర్మాతలకు గుడ్ న్యూస్ ఏంటంటే, శాటిలైట్ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్, మరియు మ్యూజిక్ డీల్స్ ద్వారా ఇప్పటికే 135 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఇది సినిమాకు బలమైన ఆర్థిక బ్యాకప్‌ను అందిస్తోంది. అయితే.. హిట్ స్టేటస్ సాధించాలంటే, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 325 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించాలి. ఈ భారీ స్క్రీన్ కౌంట్‌తో, సినిమా భారీగా జనాలను ఆకర్షించే అవకాశం ఉంది.

‘హౌస్‌ఫుల్ 5’మూవీని మరింత ఆసక్తికరంగా మార్చేది దాని రిలీజ్‌లో నిర్మాతలు చేసిన ధైర్యమైన ప్రయోగం. మొదటిసారిగా, ఈ సినిమా రెండు వేర్వేరు వెర్షన్‌లలో వస్తోంది, ప్రతి వెర్షన్‌లో మర్డర్ మిస్టరీ ప్లాట్‌లో వేర్వేరు కిల్లర్‌లు ఉంటారు. ఈ యూనిక్ ట్విస్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది, ఇప్పటికే గజిబిజిగా, సరదాగా ఉండే హౌస్‌ఫుల్ యూనివర్స్‌కు ఒక ఇంట్రిగ్ లేయర్‌ను జోడించింది. తరుణ్ మాన్సుఖానీ దర్శకత్వంలో రూపొందిన హౌస్‌ఫుల్ 5లో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ లాంటి స్టార్ కాస్ట్ ఉంది.

Tags:    

Similar News