'ఛావా' వివాదం – చరిత్రను వక్రీకరించారనే ఆరోపణలు!

By :  T70mm Team
Update: 2025-02-26 12:48 GMT


విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన "ఛావా" బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా దూసుకుపోతుంది. అయితే, సినిమా ఘన విజయం సాధిస్తున్నప్పటికీ, చరిత్రను వక్రీకరించారనే ఆరోపణలతో వివాదంలో చిక్కుకుంది.

గణోజీ మరియు కణోజీ షిర్కే వారసులు తమ పూర్వీకులను సినిమాలో నెగటివ్‌గా చూపించారని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సినిమాలో వీరు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను మోసం చేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌కు సమాచారం ఇచ్చినట్లు చూపించడాన్ని షిర్కే కుటుంబ సభ్యులు నిరసించారు. ఈ తప్పుడు ప్రదర్శన కారణంగా, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

ఈ వివాదం ముదిరిపోకుండా ఉండేందుకు లక్ష్మణ్ ఉటేకర్, షిర్కే కుటుంబ సభ్యుడు భూషణ్ షిర్కే ను సంప్రదించి క్షమాపణలు తెలిపారు. అయితే, వారు చిత్రంలో వివాదాస్పద సన్నివేశాలను తొలగించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ వివాదం మరోసారి చారిత్రక చిత్రాల్లో నిజమైన కథనాలను ఎలా చెప్పాలి? వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా చిత్రాలు తీసే హక్కు ఉందా? అనే ప్రశ్నలను ముందుకు తెచ్చింది.

Tags:    

Similar News