సంజీవని కోసం అడవుల్లోకి మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB29పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తోన్న సినిమా కావడంతో యావత్ ప్రపంచ సినీ ప్రియులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.;
సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB29పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తోన్న సినిమా కావడంతో యావత్ ప్రపంచ సినీ ప్రియులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ స్టోరీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ చిత్రాన్ని రామాయణం ఇతివృత్తంగా తీర్చిదిద్దుతున్నాడట రాజమౌళి. రామాయణంలో సంజీవని మూలిక కోసం హనుమంతుడు చేసిన సాహసం తెలిసిందే. అదే తరహాలో SSMB29లో మహేష్ బాబు ఒక ప్రాణాన్ని కాపాడేందుకు అమెజాన్ అడవుల్లోకి వెళ్తాడట. అక్కడి దారులు, పోటీ పడే ఇతర గుంపులు, ప్రకృతి అడ్డంకులను దాటి సంజీవని తెచ్చే యాత్రే ఈ మూవీ స్టోరీ అట.
రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పినట్లు – ఈ కథకు ఇండియానా జోన్స్ వంటి అడ్వెంచర్ థ్రిల్ ఉంటుందట. కానీ దీన్ని హిందూ మైథాలజీ రామాయణం నేపథ్యంలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకోనుంది.