కరిష్మా మాజీ భర్త మరణం
పారిశ్రామికవేత్త, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ (53) అనూహ్యంగా మృతి చెందారు. శనివారం ఇంగ్లాండ్లోని గార్డ్స్ పోలో క్లబ్లో మ్యాచ్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కన్నుమూశారు.;
పారిశ్రామికవేత్త, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ (53) అనూహ్యంగా మృతి చెందారు. శనివారం ఇంగ్లాండ్లోని గార్డ్స్ పోలో క్లబ్లో మ్యాచ్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. అయితే, పోలో ఆడుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా తేనెటీగను మింగినట్టు సమాచారం. దీంతో తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ ఏర్పడి, శ్వాస ఆగిపోవడంతో గుండెపోటు వచ్చింది. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు.
సంజయ్ కపూర్ ఆటోమోటివ్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ సోనా కామ్స్టార్ (Sona Comstar) ఛైర్మన్గా వ్యవహరించారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారత పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో ఆయన విశేష పాత్ర పోషించారు. అలాగే ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ACMA)కు అధ్యక్షుడిగా ఉన్న సంజయ్, పరిశ్రమకు అనేక మార్గదర్శక మార్పులు తీసుకువచ్చారు.
ఆయన మరణానికి కొన్ని గంటల ముందే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై స్పందిస్తూ, బాధితుల కుటుంబాలకు సోషల్ మీడియాలో ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే ఆయన చివరి మెసేజ్ కావడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. కరిష్మా కపూర్తో విడాకులు తర్వాత, ఆయన ప్రియా సచ్దేవ్ను వివాహం చేసుకున్నారు. సంజయ్ ఆకస్మిక మరణం పట్ల పారిశ్రామిక, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.