ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీర్ కు బిగిసుకుంటున్న ఉచ్చు
618 మంది ఫోన్ ట్యాప్ అయ్యాయి అని సిట్ బృందం వెల్లడి;
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.నిన్న బీజేపీ సీనియర్ నేత, మాల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఫోన్ తో పాటు తన సతీమణి జమున ఫోన్ కూడా బీఆర్ఎస్ సర్కారు ట్యాపింగ్ చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. భార్య నడుపుతున్న జమున హ్యాచరీస్ ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయ్యాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఎదుట సోమవారం హాజరైన ఈటల రాజేంద్ర తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన సమాధానాలు చెప్పడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ వల్ల తాను ఎంతగా మనోవేదనకు గురయ్యానన్న విషయాన్ని కూడా ఆయన సిట్ అధికారులకు తెలియజేశారు.
2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ అయ్యినట్టు సిట్ తెలియచేసింది,ప్రతిపక్ష పార్టీ నాయకులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు ముఖ్య కార్యకర్తల ఫోన్లు కూడా టాప్ అయినట్టు అధికారులు అంటున్నారు.ప్రభాకర్ రావుకు కన్ ఫర్డ్ ఐపీఎస్ పదవి ఇవ్వడంతో కేసీఆర్ ఏది చెబితే అది చట్టం, న్యాయం అన్న విషయాలను పక్కనపెట్టి ఈ అకృత్యానికి పాల్పడరు అని ఈటెల రాజేంద్ర ఆరోపించారు.
4013 పోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసిన ప్రణీత్ రావు అండ్ టీమ్,వీరిలో 618 మంది పొలిటికల్ లీడర్ల పోన్ ట్యాపింగ్ అయినట్టుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నటు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది.2023 ఎన్నికల సమయంలో బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకుల ఫోన్లు అన్ని ట్రాప్ చేసారు అని,అందులో సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల తొ పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్టు గుర్తించింది.
త్వరలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనం పల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే KS రత్నం , మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే లు పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్య లకు నోటీస్లు ఇవ్వనున్నట్టు సిట్ బృందం తెలిపింది.
ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఐఏఎస్,ఐపీస్ లను కూడా విడిచిపెట్టలేదు అని,ఐఏఎస్ లు రోనాల్డ్ రాస్, గౌతం ల ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగాయిఅని,ఇప్పటివరకు618 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు 228 మంది స్టేట్మెంట్ రికార్డింగ్ లు పూర్తిచేసినట్టు వెల్లడించారు.ఇవ్వని చూస్తే రాబోయే జూబ్లలీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కష్టం సాధ్యం గానే కనిపిస్తుంది.ఫోన్లు ట్యాప్ చేయటం అనేది పెద్ద క్రైమ్ అని తెలిసి కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీర్ ఈ దారుణానికి ఒడికట్టారు అని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.