త్యాగానికి చిరస్మరణీయ ప్రతీక మొహర్రం.. ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్

ఇమామ్ హుస్సైన్ స్ఫూర్తి జ్ఞాపకానికి గుర్తుగా మొహర్రం జరుపుకుంటున్న ముస్లిం సోదరులు;

Update: 2025-06-27 08:32 GMT

మనవ హక్కుల సాధన కోసం ప్రాణాలు అర్పించిన చారిత్రాత్మక సంఘటనకు గుర్తుగా మొహర్రం నిలిచింది అన్నారు సీఎం చంద్రబాబు . న్యాయం కోసం, ధర్మం కోసం, అణచివేతకు వ్యతిరేకంగా నిలబడ్డ మహోన్నత ఆదర్శవంతమైనది గా నిలిచిన ఇమామ్ హుస్సైన్, మహమ్మద్ ప్రవక్త మనుమడు, కర్బలా యుద్ధంలో తన ప్రాణాలను త్యాగం చేశారు అని, ఆయనతో పాటు కుటుంబ సభ్యులు మరియు అనుచరులు కూడా అమానుషంగా హత్య చేయబడ్డారు అని చంద్రబాబు అన్నారు.

ఈ సంఘటనకు గుర్తుగా జరుపుకునే మొహర్రం శోకాన్ని, త్యాగాన్ని, ధర్మనిష్ఠను ప్రతిబింబిస్తుంది. ఇదే రోజు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. ఈ సందర్భాన్ని ముస్లిం సోదరులు ఆత్మపరిశీలనతో, ప్రార్థనలతో, పద్ధతిపూర్వక సంప్రదాయాల ఆధారంగా గౌరవంగా జరుపుకుంటారు.

ఈ మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని, ముస్లిం సోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, త్యాగాలకు స్మారకంగా మొహర్రంను సార్థకంగా జరుపుకోవాలని కోరుతున్నాను అని ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా తెలియచేసారు.

Tags:    

Similar News