దేశం విషాదంలో ఉన్నా పార్టీ చేసుకున్న ఎయిర్ ఇండియా సిబ్బంది ! దేశంలో విమర్శల ధ్వని
విమాన ప్రమాదం నడుమ DJ పార్టీ వివాదం – ఎయిర్ ఇండియాలో 6 మంది అధికారుల డిస్మిసల్;
By : Dasari Suresh
Update: 2025-06-28 08:24 GMT
విమాన ప్రమాదం నేపథ్యంలో దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయిన సమయంలో, జూన్ 20న గురుగ్రామ్ కార్యాలయంలో DJ పార్టీ నిర్వహించిన ఎయిర్ ఇండియా సిబ్బందిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల మధ్య, పార్టీకి సంబంధించి ఉన్నతాధికారులపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది.
ఈ వివాదాస్పద పార్టీలో పాల్గొన్న SATS SVP సంప్రీత్ కోటియన్, COO అబ్రహం జకారియా సహా మరో నలుగురు అధికారులను ఎయిర్ ఇండియా డిస్మిస్ చేసింది. ఈ చర్య సంస్థ వ్యవహార పద్ధతులపై ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టే దిశగా తీసుకున్న క్రమశిక్షణాత్మక చర్యగా విశ్లేషించబడుతోంది.