ఈ ఇద్దరి తొలి చిత్రాల విడుదలలో ఇంత డిలే నా?

Update: 2025-05-06 06:00 GMT

ఈ ఇద్దరి తొలి చిత్రాల విడుదలలో ఇంత డిలే నా?ఇతర భాషల్లో ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఇద్దరు బ్యూటీస్ సప్తమి గౌడ, మాళవికా మోహనన్... తమ తొలి తెలుగు సినిమాల విడుదల కోసం గత మూడు సంవత్సరాలుగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

సప్తమి గౌడ

కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రం కాంతారతో జాతీయ స్థాయి లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తమి గౌడ, 2022లో ఆ సినిమా విడుదలైన తర్వాత తెలుగులో తన తొలి సినిమా 'తమ్ముడు' కి సైన్ చేసింది. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. మొదట ఈ చిత్రం 2023లో విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా, ఈ చిత్రం 2025 జూలై 4న విడుదల కాబోతోంది. దీంతో, ప్రాజెక్ట్‌కి సైన్ చేసిన తర్వాత సప్తమికి తన తొలి తెలుగు చిత్రం థియేటర్లలోకి రావడానికి మూడు సంవత్సరాల సమయం పట్టినట్లయింది.

మాళవికా మోహనన్

తమిళంలో 'మాస్టర్, మారన్, తంగలాన్' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన మాళవికా మోహనన్, 2021లో విజయ్ దేవరకొండ సరసన తన తొలి తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకుంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అనంతరం 2022లో ప్రభాస్‌తో కలిసి 'ది రాజా సాబ్' అనే చిత్రం లో హీరోయిన్ గా అవకాశం అందుకుంది.మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వివిధ కారణాల వల్ల షూటింగ్‌లోనే ఉండిపోయింది. ఇంకా పూర్తవలేదు. అయితే, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రం 2025 సెప్టెంబరులో థియేటర్లలో విడుదల కావొచ్చని తెలుస్తోంది. ఇలా చూస్తే, మాళవికా మోహనన్ తెలుగులో అడుగుపెట్టేందుకు ప్రయత్నం మొదలుపెట్టి ఇప్పటికి మూడు సంవత్సరాలు దాటిపోతున్నాయి.

సో... ఒక్కోసారి ఒక భాషలోకి కొత్తగా ప్రవేశించాలంటే, వారి క్రేజ్, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసిరావాలని ఈ ఇద్దరు బ్యూటీస్ నిరూపించారు.

Tags:    

Similar News