ట్రైన్ యాక్షన్ సీన్ హైలైట్ గా ‘పెద్ది’
స్పెషల్గా డిజైన్ చేసిన ట్రైన్ సెట్లో షూటింగ్ జరుగుతోంది, దీన్ని ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అత్యంత రియలిస్టిక్గా తీర్చిదిద్దారు. స్టంట్ కొరియోగ్రఫర్ నబకాంత ఈ యాక్షన్ సీక్వెన్స్ను రూపొందిస్తున్నారు.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ప్రస్తుతం ఫుల్ జోష్లో షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా, థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు సినీ లవర్స్కు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ను అందించబోతోందని ఇప్పటికే బజ్ క్రియేట్ అవుతోంది.
హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్ సెట్లో ఇప్పుడు హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ను ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సీన్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ట్రైన్ సెట్లో షూటింగ్ జరుగుతోంది. దీన్ని ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అత్యంత రియలిస్టిక్గా తీర్చిదిద్దారు. స్టంట్ కొరియోగ్రఫర్ నబకాంత ఈ యాక్షన్ సీక్వెన్స్ను రూపొందిస్తున్నారు. ఇది సినిమాలోని మేజర్ హైలైట్గా నిలవనుందని టీమ్ సూపర్ కాన్ఫిడెంట్గా ఉంది. ఈ షెడ్యూల్ మరో కొన్ని రోజులు కొనసాగనుంది, అండ్ ఈ సీన్ ఆడియెన్స్ను థ్రిల్కి గురిచేయడంతో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తుందని అంచనా.
‘పెద్ది’ సినిమా 2026 మార్చి 27న పాన్-ఇండియా లెవెల్లో బహుభాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివ రాజకుమార్, బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ, సీనియర్ యాక్టర్ జర జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ స్టెల్లార్ కాస్ట్ సినిమాకి ఇంకా హైప్ని తీసుకొస్తోంది. దానికి తోడు, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకి గ్రాండ్ వైబ్స్ను యాడ్ చేస్తాయని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.