మరో టాలెంటెడెడ్ యాక్టర్ కన్ఫర్మ్?
తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ తమిళ నటుడు ఆర్. మాధవన్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎంపికయ్యాడని టాక్ . త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.;
సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కానప్పటికీ, ఇది భారతీయ సినిమా ప్రియులలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఒక ఉత్కంఠభరితమైన ఫారెస్ట్ అడ్వెంచర్గా రూపొందుతోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ తమిళ నటుడు ఆర్. మాధవన్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎంపికయ్యాడని టాక్ . త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. అతను షూటింగ్ సెట్స్లో చేరనున్నాడు. యస్ యస్ యంబీ 29 గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చిత్రీకరణ జరపనుంది. రాజమౌళి తనదైన విజన్తో ఈ సినిమా కోసం అద్భుతమైన లొకేషన్స్ను ఇప్పటికే ఎంపిక చేశారు.
ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన మరియు భారీ అంచనాలతో కూడిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ రిలీజ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, షూటింగ్ పూర్తయ్యే వరకు విడుదల తేదీ గురించి స్పష్టత రాదని తెలుస్తోంది. ఈ భారీ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ స్టైలిష్ చిత్రానికి సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు.