కింగ్ ఖాన్ తో మైత్రీ మూవీ మేకర్స్?
హిందీ ఫిల్మ్ సర్కిల్స్లో లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కింగ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే భారీ అడ్వాన్స్ తీసుకున్నాడట. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ను దాదాపు ఫైనల్ చేసినట్టే అని టాక్.;
గత కొన్ని వారాలుగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, టాలీవుడ్లో టాప్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మధ్య ఒక భారీ కొలాబరేషన్ గురించి సినీ వర్గాల్లో హాట్ టాక్ నడుస్తోంది. హిందీ ఫిల్మ్ సర్కిల్స్లో లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కింగ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే భారీ అడ్వాన్స్ తీసుకున్నాడట. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ను దాదాపు ఫైనల్ చేసినట్టే అని టాక్.
మైత్రీ మూవీ మేకర్స్లో నవీన్ యెర్నేని, రవిశంకర్ ఎలా ఆలోచిస్తారో, ఎలా పనిచేస్తారో చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. ముఖ్యంగా.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ ఫ్రాంచైజీని వాళ్లు ఎంత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించి, దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రమోట్ చేశారో తెలిసిందే. అది చూసి షారుఖ్ ఖాన్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయాడట. ఈ ప్రాజెక్ట్ మైత్రీ లాంటి టీమ్ చేతుల్లో అయితే సూపర్ సేఫ్ అని, అదిరిపోయే అవుట్పుట్ వస్తుందని షారుఖ్ గట్టిగా నమ్ముతున్నారని ఇన్సైడర్స్ చెబుతున్నారు. అంతేకాదు, ఈ సినిమాను సౌత్ మార్కెట్లలో కూడా బాగా హైప్ చేస్తారని, దీనివల్ల షారుఖ్కు దక్షిణాదిలోనూ మంచి రీచ్ వస్తుందని టాక్. ఇది షారుఖ్ లాంటి పాన్-ఇండియా స్టార్కు ఒక ఎక్స్ట్రా బూస్ట్ లాంటిది.
షారుఖ్-మైత్రీ కొలాబ్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. షారుఖ్ టీమ్ నుంచో, మైత్రీ నుంచో ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అభిమానులు ఈ డీల్ గురించి స్పష్టమైన అప్డేట్ కోసం మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. కానీ, సినీ సర్కిల్స్లో మాత్రం ఈ ప్రాజెక్ట్ గురించి రూమర్స్ ఫుల్ స్పీడ్లో సర్కులేట్ అవుతున్నాయి. అందులో ఒక క్రేజీ టాక్ ఏంటంటే, ఈ భారీ ప్రాజెక్ట్కు దర్శకుడిగా ‘పుష్ప’ ఫేమ్ సుకుమార్ ముందు వరుసలో ఉన్నాడని. ఇది నిజమైతే, ఇది ఒక సెన్సేషనల్ కాంబో అవుతుందని ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఊహించేస్తున్నారు.