కొత్త సినిమాను మొదలు పెట్టేసిన రవితేజ
ఈ రోజు హైదరాబాద్లో ఈ సినిమాను ఘనంగా లాంచ్ చేశారు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి యస్ ఎల్ వీ సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు క్వాలిటీ సినిమాగా రూపొందనుందని మేకర్స్ హామీ ఇచ్చారు.;
రవి తేజ ప్రస్తుతం “మాస్ జాతర” సినిమా చివరి దశలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే అతను తన కొత్త ప్రాజెక్ట్ ‘ఆర్టీ 76’ (రవి తేజ 76వ సినిమా)ని మొదలు పెట్టనున్నాడు. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్లో ఈ సినిమాను ఘనంగా లాంచ్ చేశారు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి యస్ ఎల్ వీ సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు క్వాలిటీ సినిమాగా రూపొందనుందని మేకర్స్ హామీ ఇచ్చారు.
డైరెక్టర్ కిషోర్ తిరుమల రవితేజను ఓ కొత్త లుక్లో ప్రజెంట్ చేయనున్నాడు. అనౌన్స్మెంట్ పోస్టర్లో రవి తేజ స్టైలిష్ అవతార్లో కనిపించాడు. చెకర్డ్ డిజైనర్ సూట్లో, ఒక లెగ్ ముందు సీటుపై పెట్టి, ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో బుక్తో ఎయిర్క్రాఫ్ట్ సీట్లో చలాకీగా కనిపించాడు.
“ధమాకా” సినిమాకు చార్ట్బస్టర్ సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు మళ్లీ రవితేజతో కలిసి పని చేయనున్నాడు. సినిమాటోగ్రఫీని ప్రసాద్ మురెళ్ల, ఎడిటింగ్ను శ్రీకర్ ప్రసాద్ హ్యాండిల్ చేస్తున్నారు. ‘ఆర్టీ 76’ రెగ్యులర్ షూటింగ్ జూన్ 16 నుంచి హైదరాబాద్లో స్టార్ట్ కానుంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కానుంది.