యోధురాలిగా రష్మికా మందన్న
ఇప్పుడు రష్మికా మరో ఫీమేల్-డ్రైవన్ స్టోరీతో స్క్రీన్పై రచ్చ చేయబోతోంది. ఈ చిత్రాన్ని రవీంద్ర పుల్లె.. అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడు.;
నేషనల్ క్రష్ .. రష్మికా మందన్నా మరోసారి తన స్టార్ పవర్ని చాటుకుంటూ.. మరో మహిళా ప్రధాన చిత్రంతో రాక్ చేయడానికి రెడీ అయిపోయింది. ఆమె ఇప్పటికే రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో "ది గర్ల్ఫ్రెండ్" అనే సూపర్ స్టైలిష్ లేడీ-సెంట్రిక్ మూవీలో నటిస్తూ, థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పుడు రష్మికా మరో ఫీమేల్-డ్రైవన్ స్టోరీతో స్క్రీన్పై రచ్చ చేయబోతోంది. ఈ చిత్రాన్ని రవీంద్ర పుల్లె.. అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడు. హను రాఘవపూడి వద్ద అసోసియేట్గా పనిచేసిన యంగ్ టాలెంటెడ్ ఈ రవీంద్ర. "సీతా రామం" లాంటి బ్లాక్బస్టర్కు పనిచేశడు, రాబోయే "ఫౌజీ" మూవీలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. అంతేకాదు, "అర్జున్ చక్రవర్తి" అనే సినిమాకి రైటర్గా కూడా కంట్రిబ్యూట్ చేశాడు. రవీంద్ర స్క్రిప్ట్ వినగానే రష్మికా ఫిదా అయిపోయి.. ఒక్క సెకను ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.
తాజాగా రష్మికా సోషల్ మీడియాలో ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ని షేర్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ.. ట్విస్ట్ ఏంటంటే డైరెక్టర్ పేరునో, కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్నో రివీల్ చేయలేదు. పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. రష్మికా సూపర్ ఫియర్స్ లుక్లో, ఒక యోధురాలిగా, పొగమంచుతో కూడిన అడవిలో ఆయుధం పట్టుకుని బద్ధలు కొట్టేలా నిలబడి ఉంది. ఆమె వైపు కొందరు ఫైటర్స్ రాగానే యాక్షన్ మోడ్ ఆన్ అయినట్లుంది! పోస్టర్లో రేపు మరిన్ని డీటెయిల్స్ రివీల్ చేస్తామని టీజ్ చేశారు, సో అందరూ ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు.