‘ఓజీ’ షూట్ పూర్తి చేసిన పవర్ స్టార్
"గంభీర కోసం షూటింగ్ ర్యాప్ అయింది. ‘ఓజీ’ మూవీ సెప్టెంబర్ 25, 2025న బిగ్ స్క్రీన్స్పై హై వోల్టేజ్ హిస్టీరియాతో మీ ముందుకు రానుంది" అని ప్రకటించింది.;
గత నెలలో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మరో సినిమా షూటింగ్ను కూడా ముగించారు. "ఓజీ" సినిమా షూటింగ్ పూర్తయింది. పవన్ కళ్యాణ్ తన పార్ట్ ను కంప్లీట్ చేశారు. తాజాగా సోషల్ మీడియాలో టీమ్ ఈ అప్డేట్ను షేర్ చేస్తూ.. "గంభీర కోసం షూటింగ్ ర్యాప్ అయింది. ‘ఓజీ’ మూవీ సెప్టెంబర్ 25, 2025న బిగ్ స్క్రీన్స్పై హై వోల్టేజ్ హిస్టీరియాతో మీ ముందుకు రానుంది" అని ప్రకటించింది.
"ఓజీ" ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. ఇందులో పవన్ కళ్యాణ్ ముంబైకి చెందిన గంభీర అనే గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా షూటింగ్, పవన్ కళ్యాణ్ రాజకీయ కట్టుబాట్ల కారణంగా సంవత్సరం పాటు ఆగిపోయిన తర్వాత.. ఇటీవల తిరిగి ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి చేయడంతో.. సుజీత్ ఇప్పుడు మిగిలిన నటీనటులతో షూటింగ్ను కొనసాగించి, పోస్ట్-ప్రొడక్షన్పై ఫోకస్ చేస్తారు.
ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న దసరా సెలవులకు ముందు థియేటర్లలో విడుదల కానుంది. "ఓజీ"లో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, అర్జున్ దాస్ కీలక పాత్రలో, ఇమ్రాన్ హాష్మీ విలన్గా నటిస్తున్నారు. సంగీతం తమన్ సమకూరుస్తున్నారు. మరి ‘ఓజీ’ మూవీ ఏ రేంజ్ సినిమా అవుతుందో చూడాలి.