సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో మృణాళ్ ఠాకూర్
ఆమె పేరు ఆన్లైన్లో ట్రెండ్ అవుతోంది, ఇది యూత్లో ఆమె పెరుగుతున్న ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం మృణాళ్ తన రాబోయే హిందీ చిత్రం “సన్ ఆఫ్ సర్దార్ 2” ప్రమోషన్లో బిజీగా ఉంది.;
మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో బ్యాలెన్సుడ్ గా వెళుతోంది. ఇటీవల భారీ బ్లాక్బస్టర్స్ లేకపోయినా.. ఆమె పాపులారిటీ మాత్రం ఆకాశాన్ని తాకుతోంది. చిన్న అప్డేట్కి కూడా ఆమె పేరు ఆన్లైన్లో ట్రెండ్ అవుతోంది, ఇది యూత్లో ఆమె పెరుగుతున్న ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం మృణాళ్ తన రాబోయే హిందీ చిత్రం “సన్ ఆఫ్ సర్దార్ 2” ప్రమోషన్లో బిజీగా ఉంది.
ఆమె ఇంటర్వ్యూలు.. ప్రమోషనల్ ఈవెంట్స్.. సోషల్ మీడియాలో బాగా ఆదరణ పొందుతున్నాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ గత కొన్నేళ్లలో భారీగా పెరిగింది. తెలుగు సినిమాల విషయానికొస్తే.. మృణాళ్ ప్రస్తుతం అడివి శేష్తో కలిసి “డెకాయిట్” చిత్రీకరణలో ఉంది. అలాగే, అల్లు అర్జున్తో కలిసి ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్లో నటిస్తున్నట్లు సమాచారం.
అదనంగా, మృణాళ్ ఠాకూర్ మరో రెండు తెలుగు చిత్రాల కోసం చర్చల్లో ఉంది. ఆమె ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్, కాన్ఫిడెంట్ యాటిట్యూడ్, సోషల్ మీడియా అప్పీల్తో మృణాళ్ ఠాకూర్ యూత్ ఐకాన్గా, ఇండియన్ సినిమాలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది.