జూలైలో మొదలు కానున్న కెన్యా షెడ్యూల్ !
తదుపరి షెడ్యూల్ కోసం రాజమౌళి టీమ్ జులైలో కెన్యాకు షిఫ్ట్ కానుంది. జులై నెల పొడవునా అక్కడే స్టే చేస్తూ, కెన్యాలోని పలు నేషనల్ పార్కులలో మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాలపై హై-ఆక్టేన్ అడ్వెంచర్ సీక్వెన్స్లను చిత్రీకరించనున్నారు.;
సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న భారీ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా.. దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ రాసిన రెండు బెస్ట్సెల్లింగ్ నవలల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా హైదరాబాద్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను ఇటీవల విజయవంతంగా పూర్తి చేసింది. ఇకముందు సుమారు ఒక సంవత్సరం పాటు వివిధ లొకేషన్లలో, అలాగే హైదరాబాద్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన అద్భుతమైన సెట్లలో షూటింగ్ కొనసాగనుంది.
తదుపరి షెడ్యూల్ కోసం రాజమౌళి టీమ్ జులైలో కెన్యాకు షిఫ్ట్ కానుంది. జులై నెల పొడవునా అక్కడే స్టే చేస్తూ, కెన్యాలోని పలు నేషనల్ పార్కులలో మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాలపై హై-ఆక్టేన్ అడ్వెంచర్ సీక్వెన్స్లను చిత్రీకరించనున్నారు. ఈ కెన్యా షెడ్యూల్ సినిమా కథలో చాలా క్రూషియల్ రోల్ పోషిస్తుంది. గత ఏడాది రాజమౌళి, ఆయన కొడుకు కార్తికేయ కలిసి కెన్యాలో రెక్కీ చేసి, ఈ లొకేషన్లను ఫైనలైజ్ చేశారు. కెన్యా లొకేషన్స్లోని సహజ సౌందర్యం, అడవులు, వైల్డ్లైఫ్ ఈ సినిమాకి విజువల్ గ్రాండియర్ని యాడ్ చేయనున్నాయి.
ఈ చిత్రం హాలీవుడ్ ఐకానిక్ అడ్వెంచర్ సిరీస్ ‘ఇండియానా జోన్స్’ తరహాలో గ్లోబ్ట్రాటింగ్ థ్రిల్లర్గా రూపొందుతోంది. అయితే, రాజమౌళి స్టైల్లో భారతీయ పురాణం, ముఖ్యంగా రామాయణం నుంచి కొన్ని ఎలిమెంట్స్ని సమ్మిళితం చేస్తూ ఈ సినిమాని ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్గా మలచనున్నారు. ఈ ప్రాజెక్ట్ రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మితమవుతోంది, ఇది భారతీయ సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ టాప్-నాచ్ స్టాండర్డ్స్తో రూపొందుతున్నాయి.