ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి సన్నాహాలు!
అక్కినేని నాగచైతన్యకి చాలా కాలం తర్వాత 'తండేల్'తో మంచి సక్సెస్ లభించింది. 'తండేల్' విజయం తర్వాత ప్రస్తుతం చైతన్య 'విరూపాక్ష' దర్శకుడితో నెక్స్ట్ మూవీని చేస్తున్నాడు.;
అక్కినేని నాగచైతన్యకి చాలా కాలం తర్వాత 'తండేల్'తో మంచి సక్సెస్ లభించింది. 'తండేల్' విజయం తర్వాత ప్రస్తుతం చైతన్య 'విరూపాక్ష' దర్శకుడితో నెక్స్ట్ మూవీని చేస్తున్నాడు. ఇది చైతూ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న చిత్రంగా చెబుతున్నారు. ‘విరూపాక్ష’ తరహాలోనే ఈ సినిమా కూడా మిస్టిక్ థ్రిల్లర్ జానర్లో ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే, నాగచైతన్య కెరీర్ లో 24వ చిత్రంగా 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండు సినిమా రూపొందనుంది. ఈ సినిమా తర్వాత తన 25వ చిత్రానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడట చైతన్య. తన ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కోసం ఓ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నాగచైతన్య 25వ చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థలోనే చేయబోతున్నాడట. ఈ సినిమా ఈ ఏడాది ద్వితియార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.