గత వైభవం.. ఇప్పుడు గందరగోళం!
సినిమా ఫలితాలు ఎవరి చేతిలో ఉండవు. ఎంతో శ్రమతో, టెక్నికల్ పరంగా అద్భుతంగా రూపొందించిన సినిమాలు కూడా అర్ధం కాలేకపోతే బాక్సాఫీస్ వద్ద నెగ్గవు. ఇక ఈ మధ్యకాలంలో కేవలం స్టార్ కాంబినేషన్లు, బ్రాండ్ వాల్యూ మీద ఆధారపడి తీసే సినిమాలు అసలైన కంటెంట్ లేకపోవడంతో అట్టడుగుకు వెళ్లిపోతున్నాయి.
లేటెస్ట్ గా రిలీజ్ అయిన కమల్, మణిరత్నం 'థగ్ లైఫ్' దీనికి ఉదాహరణ. క్లాసిక్ మేకర్ మణిరత్నం నుండి వచ్చిన చిత్రానికి యునానిమస్ నెగటివ్ టాక్ రావడం అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.
శంకర్, మురుగదాస్ లాంటి దిగ్గజాల పరిస్థితీ అంతే. ఒకప్పుడు తన సినిమాలతో యావత్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శంకర్. బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టించిన శంకర్ ఇప్పుడు 'ఇండియన్ 2, గేమ్ ఛేంజర్' వంటి డిజాస్టర్స్ అందించాడు.
శంకర్ తరహాలోనే ఎన్నో సందేశాత్మక కమర్షియల్ హిట్స్ అందుకున్న మురుగదాస్ కూడా ఇటీవల 'సికందర్' తో డిజాస్టర్ అందుకున్నాడు. కానీ.. ఇదే పరిస్థితి శాశ్వతం కాదు. వారి అసలైన బలం అయిన కంటెంట్ మీద దృష్టి పెడితే. గతాన్ని మించిన ప్రయోగాలతో, హృదయాలను గెలిచే కథనాలతో తిరిగి వెలుగులోకి రావచ్చు. ప్రేక్షకులు ఎప్పుడూ కంటెంట్కే సపోర్ట్ ఇస్తారు.. ఫేమ్కి కాదు.