సురేశ్ గోపీ, అనుపమ సినిమా వచ్చేస్తోంది!

ఇందులో సురేష్ గోపి ఒక అడ్వకేట్‌గా అదరగొడుతుండగా, అనుపమ పరమేశ్వరన్ అతని క్లయింట్‌గా కీలక పాత్రలో కనిపించనుంది. దీనికి ప్రవీణ్ నారాయణన్ దర్శకుడు.;

By :  K R K
Update: 2025-05-29 12:41 GMT

డైనమిక్ హీరో సురేష్ గోపి, అందాల అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘జేయస్కే’ (జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ). ఈ సినిమా జూన్ 20, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇందులో సురేష్ గోపి ఒక అడ్వకేట్‌గా అదరగొడుతుండగా, అనుపమ పరమేశ్వరన్ అతని క్లయింట్‌గా కీలక పాత్రలో కనిపించనుంది. దీనికి ప్రవీణ్ నారాయణన్ దర్శకుడు.

‘జేయస్కే’ చిత్రంలో సురేష్ గోపి చిన్న కుమారుడు మాధవ్ సురేష్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నా. ఇది అతని కెరీర్‌లో గుర్తుండిపోయే అడుగుగా నిలవనుంది. ఇంకా.. శ్రుతి రామచంద్రన్, దివ్య పిళ్లై, అస్కర్ అలీ, బైజు సంతోష్, కొట్టాయం రమేష్, శోభి తిలకన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.

సురేష్ గోపి ప్రస్తుతం తన 250వ చిత్రం ‘ఒట్టకొంబన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు, దీనిని మాథ్యూస్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అతని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. అంతేకాకుండా, సనల్ వి. దేవన్ దర్శకత్వంలో ‘వరాహం’, అరుణ్ చందు రూపొందించిన ‘గగనచారి’ సినిమాకు స్పిన్-ఆఫ్‌గా ‘మణియన్ చిట్టప్పన్’ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు కూడా అతని రాబోయే లైనప్‌లో ఉన్నాయి. నటనతో పాటు రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్న సురేష్ గోపి, తన బహుముఖ ప్రతిభతో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఇక అనుపమ పరమేశ్వరన్ విషయానికొస్తే.... ప్రస్తుతం షరాఫుద్దీన్‌తో కలిసి దర్శకుడు ప్రనీష్ విజయన్ రూపొందిస్తున్న తొలి చిత్రం ‘పెట్ డిటెక్టివ్’ మలయాళ చిత్రంలో నటిస్తోంది. అదే సమయంలో.. దర్శన రాజేంద్రన్‌తో కలిసి తెలుగు చిత్రం ‘పరదా’లో ప్రధాన పాత్రలో కనిపించనుంది.


Tags:    

Similar News