ఇప్పుడు అందరికన్నా బిజీ హీరోయిన్ ఈమెనే!

మమితా, ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారిపోయింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సక్సెస్ తర్వాత, ఆమె ఒక్కసారిగా ఎనిమిది సినిమాల్లో నటిస్తోంది.;

By :  K R K
Update: 2025-07-13 06:40 GMT

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్‌. ఎందుకంటే ఆమె వివిధ భాషల్లో బోలెడు ప్రాజెక్టులతో సందడి చేస్తోంది. రష్మికా తర్వాత, సరిగ్గా అంతే బిజీ షెడ్యూల్‌తో ఉన్న మరో హీరోయిన్ శ్రీ లీల. ఆమె కూడా బోలెడు సినిమాలతో సతమతమవుతోంది. కానీ, ఈ ఇద్దరి కంటే ఎక్కువ బిజీగా ఉన్న ఓ స్టార్‌లెట్ గురించి తెలుసా? ఆమె ఎవరో కాదు.. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు.

ప్రేమలు సినిమాతో తన చలాకీ, బబ్లీ నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మమితా, ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారిపోయింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సక్సెస్ తర్వాత, ఆమె ఒక్కసారిగా ఎనిమిది సినిమా ఆఫర్లను కొట్టేసింది. దీంతో దేశంలోని ఇతర హీరోయిన్లను ఈ యంగ్ స్టార్ అధిగమించింది.

ఈ హ్యాపెనింగ్ స్టార్‌లెట్ ఇప్పుడు ధనుష్, సూర్య, తలపతి విజయ్ వంటి టాప్ హీరోలతో పాటు, ప్రదీప్ రంగనాథన్, సంగీత్ ప్రతాప్ లాంటి యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేయబోతోంది. అంతేకాదు, నివిన్ పాలీతో ఓ మలయాళ చిత్రంలోనూ నటించేందుకు సైన్ చేసింది. ప్రేమలు సీక్వెల్ కూడా త్వరలో రూపొందే అవకాశం ఉందని టాక్.

Tags:    

Similar News