కుంచాక్కో బోబన్ కొత్త చిత్రం షూటింగ్ పూర్తి !
మాలీవుడ్ స్టార్ హీరో కుంచాక్కో బోబన్, ‘న్నా తాన్ కేస్ కొడు’ దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ మరోసారి కలుస్తున్నారు. వీరి కలయికలో ‘ఒరు దురూహ సాహచార్యత్తిల్’ అనే కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిందని మేకర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో దిలీష్ పోతన్, ‘ఆవేశం’ ఫేమ్ సజిన్ గోపు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రతీష్ మాట్లాడుతూ, ‘‘ఈ చిత్రంతో నేను కొత్తదేదో ప్రయత్నిస్తున్నాను. ఇది సైకాలజికల్ కామెడీగా తెరకెక్కుతోంది’’ అని తెలిపారు. ఈ చిత్రాన్ని లిస్టిన్ స్టీఫెన్ , కంచాక్కో బోబన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని డాన్ విన్సెంట్ అందిస్తున్నారు.
కుంచాక్కో బోబన్ లేటెస్ట్ గా జీతు అశ్రఫ్ దర్శకత్వం వహించిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదలై భారీ విజయాన్ని సాధించగా.. అతడి కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. ఇంక ఇదే కాకుండా.. కుంచాక్కో బోబన్ రతీష్ కాంబినేషన్లో ‘అన్యగ్రహ జీవిగల్’ అనే సైన్స్ ఫిక్షన్ చిత్రం కూడా రాబోతుందని గతంలో రతీష్ వెల్లడించారు. అయితే, ఈ ప్రాజెక్ట్పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.