బిజు- జోజులతో జీతు జోసెఫ్ చిత్రం !
'వలదువశత్తే కళ్ళన్' (కుడిపక్క భాగంలో దొంగ) టైటిల్ తో.. రూపొందనున్న ఈ చిత్రంలో బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.;
'దృశ్యం' వంటి క్లాసిక్ క్రైమ్ థ్రిల్లర్కు దర్శకత్వం వహించిన జీతు జోసఫ్, తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. 'వలదువశత్తే కళ్ళన్' (కుడిపక్క భాగంలో దొంగ) టైటిల్ తో.. రూపొందనున్న ఈ చిత్రంలో బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. తాజాగా సోషియల్ మీడియా వేదికగా ఈ మూవీని అనౌన్స్ చేశారు. టైటిల్ పోస్టర్పై "న్యాయపు నీడలో.. కొన్ని కేసులు విముక్తి గురించి రహస్యంగా కబుర్లు చెబుతాయి".. అనే కేప్షన్ తో ఈ మూవీ రూపొందనుంది.
త్వరలో చిత్రీకరణ ప్రారంభించబోతున్న ఈ చిత్రానికి స్క్రీన్ప్లే, దర్శకత్వం దిను థామస్ ఈలన్ అందించారు. ఆయన 2018లో వచ్చిన 'కూదాశ' అనే సినిమాకు కూడా రచయిత, దర్శకుడు. చిత్ర నిర్మాతలు చెప్పిన వివరాల ప్రకారం, 'వలదువశత్తే కళ్ళన్' మూవీ.. నేరం, మనసాక్షి మధ్య ముడిపడిన కథ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో ఇంకా.. లేన, ఇర్షాద్ అలీ, 'ఆడుజీవితం' నటుడు కెఆర్ గోకుల్, షాజు శ్రీధర్ కూడా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
జోజు జార్జ్.. సూర్య ప్రధాన పాత్రలో కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రెట్రో' సినిమాలో ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. అంతేకాకుండా, జోజు మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న 'తగ్ లైఫ్' చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది జూన్ 5న విడుదల కానుంది.
ఇక బిజు మీనన్ కు కూడా పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 14 సంవత్సరాల తరువాత తమిళ సినిమాకు రీ-ఎంట్రీ ఇస్తూ, ఏఆర్ మురుగదాస్-శివకార్తికేయన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'మదరాసి' సినిమాలో కనిపించ నున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. మలయాళంలో, ఆయన 'అవరచన్ అండ్ సన్స్' అనే డెబ్యూటెంట్ తంబీ దర్శకత్వ చిత్రం, అలాగే అసిఫ్ అలితో కలిసి జిస్ జాయ్ రూపొందిస్తున్న 'తలవన్' సీక్వల్లో కూడా నటిస్తున్నారు.