ఉన్నిముకుందన్ పై పోలీస్ కేస్ !
విపిన్ కుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో టోవినో థామస్ నటించిన తాజా చిత్రం 'నరివేట్ట' గురించి పాజిటివ్ రివ్యూను షేర్ చేశాడు. ఈ చర్య ఉన్ని ముఖర్జీకి కోపం తెప్పించినట్లు తెలుస్తోంది.;
మాలీవుడ్ స్టార్ హీరో ఉన్ని ముకుందన్, ఇటీవల 'మార్కో' అనే యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. అయితే.. ఇప్పుడు అతడిపై ఊహించని విధంగా ఒక కేసు నమోదైంది. అది కూడా ఆయన సొంత మేనేజర్ విపిన్ కుమార్ ఫిర్యాదు మేరకు. ఈ సంఘటన మలయాళ సినీ పరిశ్రమలోనే కాకుండా, సోషల్ మీడియా వేదికలపై కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విషయం ఏమిటంటే... విపిన్ కుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో టోవినో థామస్ నటించిన తాజా చిత్రం 'నరివేట్ట' గురించి పాజిటివ్ రివ్యూను షేర్ చేశాడు. ఈ చర్య ఉన్ని ముకుందన్ కు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆయన తన మేనేజర్పై మాటలతో దూషణలు మొదలుపెట్టి, ఆ తర్వాత శారీరకంగా కూడా దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన విపిన్ను తీవ్రంగా కలచివేసింది, దీంతో ఆయన ఉన్ని ముకుందన్ పై పోలీసు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదు తర్వాత విపిన్ మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన సంఘటన వివరాలను వెల్లడించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఉన్ని ముకుందన్ ప్రవర్తనపై అభిమానులు, ప్రేక్షకులు, సినీ విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా మంది ఈ ఘటనపై నిరాశ, ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఒక నటుడు తన సన్నిహిత సహాయకుడిపై ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని సోషల్ మీడియా వేదికలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం, ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది. ఉన్ని ముకుందన్ నుంచి అధికారిక స్పందన ఇంకా రావలసి ఉంది.