మమ్ముట్టి, మోహన్ లాల్ తో సినిమాలు చేస్తాడా?

బాలీవుడ్‌లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో "శక్తిమాన్" చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.;

By :  K R K
Update: 2025-01-26 00:57 GMT

గత ఏడాది బాసిల్ జోసఫ్ నటుడిగా వరుస హిట్స్ సాధించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అతడు బాలీవుడ్‌లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో "శక్తిమాన్" చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్‌లతో ఆయన సినిమా చేస్తాడా అనే ప్రశ్న సినీ ప్రేమికులలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్‌ కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ, కొత్త తరహా కథలు చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు నటించే సినిమాలను బాసిల్ జోసఫ్ డైరెక్ట్ చేస్తే.. అది సినిమా ప్రేమికులకు పండగగా ఉంటుంది.

తాజాగా, తన తాజా చిత్రం "ప్రావిన్ కూడు షాప్పు" ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బాసిల్ మాట్లాడుతూ.. మమ్ముట్టి, మోహన్‌లాల్‌లతో తనకు సినిమాలు చేయాలని ఉంది అని చెప్పాడు. స్క్రిప్ట్‌ల గురించి కొన్ని ఆలోచనలు ఉన్నాయని, కానీ వాటి టైమ్‌లైన్ ఇంకా స్పష్టంగా లేదని అన్నాడు. "ఈ సినిమాలు త్వరగా జరుగుతాయని నేనూ కోరుకుంటున్నాను. కానీ ఇది నా చేతుల్లో ఉండటం లేదు కాబట్టి ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి," ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ప్రస్తుతం బేసిల్ స్క్రిప్ట్ దశలో ఉన్న కొన్ని ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు. ఈ ఏడాది బాసిల్ తన కొత్త చిత్రం "ప్రావిన్ కూడు షాప్పు" తో ప్రారంభించారు, ఈ సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన సమీక్షలు పొందుతోంది.

Tags:    

Similar News