‘అతిభీకర కాముకన్’ మలయాళం చిత్రం ప్రారంభం !
లుక్మాన్ అవరాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం "అతిభీకర కాముకన్" సోమవారం త్రిశ్శూర్లోని తణియిల్ శ్రీ భగవతి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో కథానాయికగా దృశ్య రఘునాథ్ ఎంపికైంది. సీసీ నితిన్, గౌతమ్ తణియిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ గతంలో లుక్మాన్ కథానాయకుడిగా నటించిన "కరోనా ధావన్" సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. గౌతమ్.. "మార్కో" ఫేమ్ హనీఫ్ అదేనీ వద్ద అసిస్టెంట్గా పని చేశారు.
సుజై మోహన్రాజ్ కథను అందించిన ఈ చిత్రంలో కార్తీక్, మనోహరి జోయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతికంగా చూస్తే, ఈ చిత్రానికి శ్రీరామ్ చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజీష్ ఆనంద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలాగే, బిబిన్ అశోక్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఈ చిత్రాన్ని సుజై, నితిన్, గౌతమ్, దీప్తి గౌతమ్ కలిసి పింక్ బైసన్ స్టూడియోస్, కల్ట్ హీరోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. సినిమా కథ, ఇతర పాత్రధారుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే, లుక్మాన్ త్వరలో "తల్లుమాల" దర్శకుడు ఖలీద్ రెహ్మాన్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా "ఆలప్పుళ జింఖానా" చిత్రంలో నస్లెన్తో కలిసి నటించనున్నారు