వరలక్ష్మి శరత్ కుమార్ హాలీవుడ్ ఎంట్రీ!
‘రిజానా - ఎ కేజ్డ్ బర్డ్’ అనే గ్లోబల్ సినిమాలో కీలక రోల్లో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్లో జెరెమీ లాంటి లెజెండ్తో స్క్రీన్ షేర్ చేయడం తనకు సర్రియల్ ఎక్స్పీరియన్స్లా అనిపించిందని వరలక్ష్మి ఓపెన్గా చెప్పారు.;
తమిళ క్రేజీ నటీమణి వరలక్ష్మి శరత్కుమార్.. అంతర్జాతీయ స్థాయిలో హవా చేస్తున్న బ్రిటిష్ నటుడు, ఆస్కార్ విన్నర్ జెరెమీ ఐరన్స్తో కలిసి ‘రిజానా - ఎ కేజ్డ్ బర్డ్’ అనే గ్లోబల్ సినిమాలో కీలక రోల్లో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్లో జెరెమీ లాంటి లెజెండ్తో స్క్రీన్ షేర్ చేయడం తనకు సర్రియల్ ఎక్స్పీరియన్స్లా అనిపించిందని వరలక్ష్మి ఓపెన్గా చెప్పారు. తమిళ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సాలిడ్ గుర్తింపు సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్, ఈ మూవీతో హాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఈ సినిమా గురించి తన ఎగ్జైట్మెంట్ని షేర్ చేస్తూ వరలక్ష్మి ఇలా అన్నారు, “ఆస్కార్ అవార్డ్ గెలిచిన జెరెమీ ఐరన్స్తో వర్క్ చేయడం నిజంగా కలలాంటి అనుభవం. ‘ది లయన్ కింగ్’లో స్కార్ క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చిన ఆయన నా ఫేవరెట్. ఆ సినిమా డైలాగ్లు నాకు కంఠస్థం, అంతగా ఇష్టం. అలాంటి ఐకానిక్ యాక్టర్తో నా హాలీవుడ్ డెబ్యూ చేయడం నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. జెరెమీ కేవలం హాలీవుడ్లోనే కాదు, వరల్డ్ సినిమాలోనూ రెస్పెక్టెడ్ ఫిగర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నాకు గర్వకారణం..’’ అన్నారు.
శ్రీలంక సినిమా ఇండస్ట్రీని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లిన దిగ్గజ డైరెక్టర్ చంద్రన్ రుత్నమ్ లాంటి విజనరీతో వర్క్ చేసే ఛాన్స్ దక్కినందుకు వరలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. “ఈ అవకాశం నాకు చాలా స్పెషల్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఇలాంటి లెజెండ్స్తో కలిసి పనిచేయడం నిజంగా థ్రిల్లింగ్గా, గౌరవంగా అనిపిస్తోంది. ఈ జర్నీ నా కెరీర్లో ఓ మైల్స్టోన్గా నిలిచిపోతుంది,” అని ఆమె తెలిపారు.
ఈ సినిమా దక్షిణాసియా సినిమాకి, అంతర్జాతీయ సినిమాకి మధ్య ఒక గేమ్-చేంజర్ కొలాబరేషన్గా రూపొందనుంది. చంద్రన్ రుత్నమ్ డైరెక్షన్లో, జగత్ సుమతిపాల ప్రొడక్షన్లో, శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ, 2005లో సౌదీ అరేబియాలో ఒక బేబీ మరణానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొని, శిరచ్ఛేదం చేయబడిన రిజానా నఫీక్ అనే యువతి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రిజానా పాత్రను విదుషికా రెడ్డి పోషిస్తున్నారు.